Home » Vangalapudi Anitha
Andhrapradesh: ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై విపత్తుల నిర్వాహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత... అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లాల కలెక్టర్లతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. ఆయా జిల్లాలో వర్షాల ప్రభావం, తాజా పరిస్థితిపై ఆరా తీశారు. అల్లూరి జిల్లాలో ఏడు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
బాధితులపైనే హత్య కేసు మోపిన గుంటూరు పోలీసులపై హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) సీరియస్ అయ్యారు.
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో బాలికను హత్యచేసిన నిందితుడ్ని వదిలిపెట్టేది లేదని హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత స్పష్టంచేశారు.
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను శనివారం దారుణంగా హత్య చేసిన నిందితుడు బోడా బత్తుల సురేశ్ (26) కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
కొప్పుగుండుపాలెం(Koppgundupalem)లో బాలిక హత్యపై హోం మంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) సీరియర్ అయ్యారు. ఈ ఘటన దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగినట్లు హోంమంత్రి అనిత చెప్పారు. పరారీలో ఉన్న నిందితుణ్ని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని అనిత అన్నారు.
Andhrapradesh: విశాఖ సెంట్రల్ జైలుని హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం సందర్శించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ.. 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. పోలీసులు పని చేయడానికి సరైన వసతులు లేవని.. మహిళ పోలీసులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పోలీస్ క్వార్టర్స్ శిథిలావస్థలో ఉన్నాయన్నారు.
విజయవాడ: వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారని, పోలీసులను కేవలం బందోబస్తుకే వాడారని, పోలీసు అకాడమీ, గ్రేహౌండ్ అకాడమీ కూడా లేదని, కేంద్రం నుంచి నిధులు వచ్చినా పోలీసు అకాడమీ నిర్మాణాలు చేయలేదని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజీబిజీగా గడుపుతున్నారు. కీలక శాఖల అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. పలువురు ముఖ్య నేతలు, ప్రముఖలు కూడా ఆయనను కలుస్తున్నారు.
నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఉదయం 10 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ లోని కేబినెట్ హాల్లో మంత్రిమండలి సమావేశం కానుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చేసిన ఐదు సంతకాలకు నేడు కేబినెట్లో ఆమోదం తెలపనున్నారు.
తిరుమల: తెలుగుదేశం నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. చీరాలలో దారుణమైన ఘటన చోటు చేసుకుందని.. సంఘటన జరిగిన 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని చెప్పారు.