Home » Vangalapudi Anitha
వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్పై హోం మంత్రి అనిత, మంత్రి సవిత స్పందించారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని, రానున్న రోజుల్లో మరిన్ని విషయాలు కూడా బయటపడతాయన్నారు.
సంక్రాంతికి ధనుర్మాసంలో తెలుగు లోగిళ్లలో వాకిళ్ల ముందు తీర్చిదిద్దే ముగ్గులు మహిళల్లోని నైపుణ్యాన్ని, సమర్థతను ప్రతిబింబిస్తాయని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
గంజాయి సాగు, రవాణాను పూర్తిగా నిర్మూలించడానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా గంజాయి సాగు చేసిన మన్యంలో ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.
Visakhapatnam: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం ఉదయం విశాఖ సెంట్రల్ జైల్ను సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తప్పిదాల వలనే విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందని, ఖైదీల రక్షణే ముఖ్యమని అన్నారు. ఇటీవలే జైల్లో సెల్ ఫోన్లు బయటపడ్డాయని, సెల్ ఫోన్లు బయటపడిన చోట కూడా పరిశీలించామని, విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Andhrapradesh: అనంతపురం పీటీసీలో డీఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీఎస్పీల ట్రైనింగ్లో మహిళలు ప్రతిభ కనబరచడం చాలా గర్వంగా ఉందన్నారు. ‘‘మహిళలు, చిన్న పిల్లలపై అఘాయిత్యాల విషయంలో మనం కార్నర్ అవుతున్నాము’’..
Andhrapradesh: వైసీపీ అధినేత జగన్పై హోంమంత్రి అనిత విరుచుకుపడ్డారు. జగన్ తల్లి, చెల్లి విషయంలో తాను చెప్పిందే నిజమైందని అన్నారు. వాళ్ల పార్టీ నేతలే జగన్కు నమ్మడం లేదని... అందుకే ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారంటూ హోంమంత్రి కామెంట్స్ చేశారు.
పోలీసులకు ఆయుధాల్లాగే ప్రజలకు మొబైల్ ఫోన్లు కూడా ఉన్నాయని, వాటిని వినియోగించి నేర నియంత్రణకు సహకరించాలని హోంమంత్రి అనిత కోరారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం శాఖ మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2023, మార్చి 31వ తేదీ నాటికి దేశంలో నక్సలిజం అంతం, అర్బన్ నక్సల్స్ అంశాలపై చర్చించారు.
వైసీపీ ప్రభుత్వంలో వేధింపులకు గురైన ముంబై నటి కాదంబరి జెత్వానీ ఇవాళ (గురువారం) హోంమంత్రి అనితను కలవనున్నారు. మరి కాసేపట్లో సెక్రటేరియట్లో మంత్రితో భేటీ కానున్నారు. తనపై కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలంటూ హోంమంత్రిని ఆమె కోరనున్నారని తెలుస్తోంది.
Andhrapradesh: మరో ముప్పు ముంచుకొస్తున్న నేపథ్యంలో హోం, విపత్తుల నిర్వహణ శాఖలను హోం మంత్రి అనిత అప్రమత్తం చేశారు. ఉత్తరాంధ్రను వానలు ముంచెత్తుతుండడంతో విజయవాడ నుంచి హోంమంత్రి అనిత బయలుదేరి వెళ్లారు. కోస్తాంధ్రలోను అతి భారీ వర్షాలున్నాయన్న వాతావరణ శాఖ సమాచరం నేపథ్యంలో రాబోయే 72 గంటలు జాగ్రత్తగా ఉండాలని హోం మంత్రి సూచించారు.