Home » Vangalapudi Anitha
Andhrapradesh: అనంతపురం పీటీసీలో డీఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీఎస్పీల ట్రైనింగ్లో మహిళలు ప్రతిభ కనబరచడం చాలా గర్వంగా ఉందన్నారు. ‘‘మహిళలు, చిన్న పిల్లలపై అఘాయిత్యాల విషయంలో మనం కార్నర్ అవుతున్నాము’’..
Andhrapradesh: వైసీపీ అధినేత జగన్పై హోంమంత్రి అనిత విరుచుకుపడ్డారు. జగన్ తల్లి, చెల్లి విషయంలో తాను చెప్పిందే నిజమైందని అన్నారు. వాళ్ల పార్టీ నేతలే జగన్కు నమ్మడం లేదని... అందుకే ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారంటూ హోంమంత్రి కామెంట్స్ చేశారు.
పోలీసులకు ఆయుధాల్లాగే ప్రజలకు మొబైల్ ఫోన్లు కూడా ఉన్నాయని, వాటిని వినియోగించి నేర నియంత్రణకు సహకరించాలని హోంమంత్రి అనిత కోరారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం శాఖ మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2023, మార్చి 31వ తేదీ నాటికి దేశంలో నక్సలిజం అంతం, అర్బన్ నక్సల్స్ అంశాలపై చర్చించారు.
వైసీపీ ప్రభుత్వంలో వేధింపులకు గురైన ముంబై నటి కాదంబరి జెత్వానీ ఇవాళ (గురువారం) హోంమంత్రి అనితను కలవనున్నారు. మరి కాసేపట్లో సెక్రటేరియట్లో మంత్రితో భేటీ కానున్నారు. తనపై కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలంటూ హోంమంత్రిని ఆమె కోరనున్నారని తెలుస్తోంది.
Andhrapradesh: మరో ముప్పు ముంచుకొస్తున్న నేపథ్యంలో హోం, విపత్తుల నిర్వహణ శాఖలను హోం మంత్రి అనిత అప్రమత్తం చేశారు. ఉత్తరాంధ్రను వానలు ముంచెత్తుతుండడంతో విజయవాడ నుంచి హోంమంత్రి అనిత బయలుదేరి వెళ్లారు. కోస్తాంధ్రలోను అతి భారీ వర్షాలున్నాయన్న వాతావరణ శాఖ సమాచరం నేపథ్యంలో రాబోయే 72 గంటలు జాగ్రత్తగా ఉండాలని హోం మంత్రి సూచించారు.
Andhrapradesh: బుడమేరులో గండ్లు పడిన ప్రాంతాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా హోంమంత్రి ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... గత ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగానే విజయవాడ ముంపుకు గురయిందని విమర్శించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత నిన్న(ఆదివారం) అర్ధరాత్రి సమయంలో విజయవాడ సమీపం బుడమేరు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. రాత్రి మెుత్తం పర్యటిస్తూ వరదల్లో చిక్కుకుని ఆకలితో అలమటిస్తున్న వందలాది మంది ప్రజలకు దగ్గరుండి మరీ ఆహారాన్ని పంపిణీ చేసే పనులను నిరంతరం పరిశీలించారు.
Andhrapradesh: పరవాడ సినర్జిన్ కంపెనీ బాధితులకు పరిహారం అందజేస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు కార్మికులకు ఒక్కక్కరికి కోటి రూపాయలు పరిహారం అందచేస్తామన్నారు. విశాఖ రెండు ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకున్నది కూటమి ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు.
Andhrapradesh: అవాస్తవాలు, అబద్ధాలు చెప్పడం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యలు చేశారు. శనివారం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారిపై జగన్ ధర్నా చేయాలన్నారు. ‘‘జగన్ మృతుల దగ్గరికి వెళ్లి నవ్వుతాడు, బాధితుల దగ్గరికి వెళ్లి సరదాలు చేస్తాడు’’ అంటూ మండిపడ్డారు.