Home » Vande Bharat Express
ఇటివల మన దేశంలో ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు విదేశాల్లోనూ క్రేజ్ వచ్చింది. అంతేకాదు పలు దేశాలు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కూడా చూపిస్తున్నాయి. అయితే వారు కొనుగోలు చేసేందుకు గల కారణాలు కూడా చెప్పారు. వారు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారనేది ఇక్కడ తెలుసుకుందాం.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ర్టం ఇటావాలో వందే భారత్ రైలు ప్రారంభించే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే సరితా బదౌరియాకు రైలు ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా తోపులాట జరగడంతో ఆమె పట్టాలపై పడిపోయారు. హుటాహుటిన పోలీసులు ఎమ్మెల్యేను రక్షించి ఆస్పత్రికి తరలించారు.
మనసునిండా ద్వేషం నింపుకొన్న కొందరు భారత్, గుజరాత్ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఏ అవకాశాన్నీ వదిలిపెట్టడం లేదని ప్రధాని మోదీ విమర్శించారు.
వందే మెట్రో సర్వీస్ పేరును "నమో భారత్ ర్యాపిడ్ రైల్"గా మారుస్తూ భారతీయ రైల్వే అధికారిక ప్రకటన జారీ చేసింది. గుజరాత్లోని భుజ్-అహ్మదాబాద్ వందే మెట్రో ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందు పేరు మార్పు జరిగింది.
దేశంలోని ప్రప్రథమ వందేభారత్ మెట్రో రైలును ప్రధాని మోదీ సోమవారం ఇక్కడ ప్రారంభించనున్నారు. ఇది అహ్మదాబాద్-భుజ్ల మధ్య తిరగనుంది.
వందేభారత్ స్లీపర్ ట్రైన్ కోసం బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(బీఈఎంఎల్) కంపెనీలో తయారు చేస్తున్న బోగీల నమూనా ఫొటోలను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం విడుదల చేశారు.
చెన్నై-నాగర్కోయిల్ మధ్య వందే భారత్ రైలు సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఈ నెల 31న ప్రారంభించనున్నట్లు దక్షిణ రైల్వే వర్గాలు తెలిపాయి. దేశ ప్రధానిగా మూడో సారి బాధ్యతలు చేపట్టిన మోదీ జూన్ 20వ తేది నగరానికి వస్తారని ప్రకటించారు.
వందేభారత్ రైళ్లను తయారు చేసేందుకు నిర్ణయించిన రూ.30 వేల కాంట్రాక్ట్ను రద్దు చేస్తూ భారతీయ రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది. సెమీ-హై-స్పీడ్ రైల్వే సర్వీస్ అయిన వందే భారత్ ఎక్స్ప్రెస్(Vande Bharath Express) తయారీ, నిర్వహణ కోసం ఈ టెండర్ను పిలిచారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) వచ్చే నెలలో రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో తిరిగే రెండు వందే భారత్ రైళ్లతోపాటు రామేశ్వరం - పాంబన్(Rameshwaram - Pamban) వంతెనను కూడా ఆయన ప్రారంభించనున్నారు.
భారతీయ రైల్వే నెట్వర్క్లో(Indian Railways) 2019-20 నుండి 2023-24 వరకు 100 వందేభారత్ సర్వీసులతో సహా 772 రైలు సర్వీసులను ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw) శుక్రవారం రాజ్యసభలో తెలిపారు.