Home » Uttarakhand
చార్ధామ్ యాత్ర(Chardham Yatra 2024) మే 10 నుంచి మొదలు కానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పర్యాటక శాఖ ఇప్పటికే పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో హరిద్వార్, రిషికేశ్లలో నేటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి.
భవిష్యత్తులో యుద్దాలు.. రాజ్యాలు కోసం... సంపదలు కోసం జరగవు.. నీటి కోసం జరుగుతాయంటూ భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహరావు దశాబ్దాల క్రితమే స్పష్టం చేశారు. చూడబోతే ఆయన వ్యాఖ్యలు అక్షర సత్యాలయ్యే అవకాశాలు ఉన్నాయి.
భారత్లోని భూభాగాలను తమ మ్యాప్లో చూపించడమే కాకుండా.. తమ దేశ కరెన్సీ నోటుపై కొత్త మ్యాప్ను ముద్రించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేపాల్ కరెన్సీలోని రూ.100 నోటుపై పాత మ్యాప్కు బదులు కొత్త మ్యాప్ను రూపొందించాలని నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
పతంజలికి మరో షాక్ తగిలింది. పతంజలికి చెందిన 14 ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పతంజలి ఉత్పత్తులకు సంబంధించి తప్పుదారి ప్రకటించే కేసు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలియజేసింది.
ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లాలోని అడవిలో 36 గంటలుగా చెలరేగుతున్న మంటలను అదుపు చేసేందుకు భారత వైమానిక దళం, భారత ఆర్మీ రంగంలోకి దిగాయి.
కాంగ్రెస్ పార్టీపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్షా భారీ పంచ్ విసిరారు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ, శివసేన, తృణమూల్ కాంగ్రెస్కు వలసలు పోతున్నారని, ఎక్కువ మంది నేతలు బీజేపీలో చేరారని చెప్పారు. కాంగ్రెస్ నేతలందరి కోసం బీజేపీ తలుపులు తెరిస్తే గ్రాండ్ ఓల్డ్ పార్టీకి కేవలం పార్టీ కార్యాలయ భవంతులే మిగులుతాయని అన్నారు.
సంస్కృతి సంప్రదాయాలకు భారతదేశం పెట్టింది పేరు. అడుగడుగునా ఆధ్యాత్మిక ఉట్టిపడే ఆలయాలు, రాజుల కాలం నాటి రాజస కట్టడాలు, శత్రు దుర్భేధ్యమైన కోటలు, ప్రశాంత సముద్ర తీరాలు.. ఇలా చెప్పుకుంటూపోతే లెక్కకు మిక్కిలి చాలా ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ వాద్రా బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఉత్తరాఖండ్ రామ్ నగర్లో ప్రియాంక శనివారం నాడు ప్రచారం చేశారు. త్యాగం గురించి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. బీజేపీలో ఏ ఒక్కరి పేరు ప్రస్తావించకుండా ప్రియాంక విమర్శలు చేశారు. దేశం కోసం ఎంత చేసినా సరే తమ కుటుంబాన్ని అవమానిస్తారని మండిపడ్డారు.
ఎన్నికల నగారా మోగిందంటే చాలు.. రాజకీయ పార్టీలు వెంటనే ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తాయి. చిన్న చిన్న మారుమూల ప్రాంతాలకు వెళ్లి మరీ.. తమకే ఓటు వేయాలని ఓటర్లను కోరుతారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. దేశవ్యాప్తంగా పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాయి.
కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం ప్రమాదవశాత్తు అదుపు తప్పి దాదాపు 200 మీటర్ల లోతులో ఉన్న గుంతలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 10 మందిలో 8 మంది మృత్యువాత చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన ఉత్తరాఖండ్(Uttarakhand)లోని నైనిటాల్(Nainital district) జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.