Home » Uttarakhand
హెలికాఫ్టర్లో కేదార్నాథ్ బయలుదేరిన ఆరుగురు భక్తులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కేదార్నాథ్లోని కేదారేశ్వరుడిని దర్శించుకునేందుకు ఆరుగురు భక్తులు శుక్రవారం సిర్సా నుంచి కేధార్నాథ్కు హెలికాఫ్టర్లో బయలుదేరారు.
ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి పోలీస్ వాహనం దూసుకెళ్లింది. ఆసుపత్రిలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ రిషికేష్లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చోటు చేసుకుంది.
ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ఆసుపత్రిలోని ఎమర్జెనీ వార్డులోకి నేరుగా పోలీస్ వాహనం వెళ్లడం వైరల్ అవుతోంది.
ఉత్తరాఖండ్లోని పితోర్ఘర్లో నాణ్యత లేని సోం పాపిడి విక్రయిస్తున్నందుకు పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ సహా మరో ఇద్దరికి పితోర్ఘర్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ శనివారం ఆరు నెలల జైలు శిక్షతోపాటు జరిమానా విధించారు.
హిమాలయాల చార్ ధామ్ యాత్ర(Char Dham Yatra 2024) నేడు అక్షయ తృతీయ పండుగ రోజున ప్రారంభమైంది. చాలా రోజుల తర్వాత గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ఆలయాల తలుపులు ఉదయం 6:55 గంటలకు ఒకేసారి తెరుచుకున్నాయి. ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు దాదాపు 15 వేల మంది యాత్రికులు(devotees) గంగోత్రి, కేదార్నాథ్ ధామ్లకు చేరుకున్నారు.
చార్ధామ్ యాత్ర(Chardham Yatra 2024) మే 10 నుంచి మొదలు కానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పర్యాటక శాఖ ఇప్పటికే పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో హరిద్వార్, రిషికేశ్లలో నేటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి.
భవిష్యత్తులో యుద్దాలు.. రాజ్యాలు కోసం... సంపదలు కోసం జరగవు.. నీటి కోసం జరుగుతాయంటూ భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహరావు దశాబ్దాల క్రితమే స్పష్టం చేశారు. చూడబోతే ఆయన వ్యాఖ్యలు అక్షర సత్యాలయ్యే అవకాశాలు ఉన్నాయి.
భారత్లోని భూభాగాలను తమ మ్యాప్లో చూపించడమే కాకుండా.. తమ దేశ కరెన్సీ నోటుపై కొత్త మ్యాప్ను ముద్రించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేపాల్ కరెన్సీలోని రూ.100 నోటుపై పాత మ్యాప్కు బదులు కొత్త మ్యాప్ను రూపొందించాలని నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
పతంజలికి మరో షాక్ తగిలింది. పతంజలికి చెందిన 14 ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పతంజలి ఉత్పత్తులకు సంబంధించి తప్పుదారి ప్రకటించే కేసు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలియజేసింది.
ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లాలోని అడవిలో 36 గంటలుగా చెలరేగుతున్న మంటలను అదుపు చేసేందుకు భారత వైమానిక దళం, భారత ఆర్మీ రంగంలోకి దిగాయి.