Home » Uttarakhand
కన్వర్ యాత్ర(కావడి యాత్ర) మార్గంలోని తినుబండారాల యజమానులు బయట తమ పేర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర స్టే విధించింది.
భక్తుల(devotees) నడక మార్గంలో ఆదివారం ఉదయం పెను ప్రమాదం చోటుచేసుకుంది. కేదార్నాథ్(Kedarnath) చిర్బాస సమీపంలో కొండపై నుంచి అకస్మాత్తుగా భారీ మొత్తంలో శిథిలాలు, బండరాళ్లు పడిపోయాయి. దీంతో అదే సమయంలో యాత్రకు వెళ్తున్న వారిలో ముగ్గురు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
శివ భక్తుల వార్షిక తీర్ధయాత్ర 'కన్వర్'లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. జూలై 22న కన్వర్ యాత్ర ప్రారంభమై ఆగస్టు 2వ తేదీతో ముగుస్తుంది. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఉత్తరాఖండ్లోని రిషికేష్, హరిద్వార్కు కాలినడకన చేరుకుని గంగా జలాలను సేకరించి తిరిగి తమ స్థానిక శివాలయాల్లో సమర్పిస్తారు.
దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగ పీఠాల్లో ఒకటైన ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయం నుంచి 228 కిలోల బంగారం మాయమైందని జ్యోతిర్మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ తెలిపారు. కేదార్నాథ్లో 'గోల్డ్ కుంభకోణం' జరిగిందని మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్లోని రెండు కీలక అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. బద్రీనాథ్, మంగళౌర్లో విజయకేతనం ఎగురవేసింది. జూలై 10వ తేదీన జరిగిన ఉపఎన్నికల ఫలితాలను శనివారంనాడు ప్రకటించారు.
ఆ యువతి పేరు హర్షిక పంత్. ఆమె వయసు 21 సంవత్సరాలు. నడుము పక్షవాతంతో బాధపడుతున్న ఆమె బాల్యం నుంచే శ్రీకృష్ణుని భక్తురాలు. తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి..
న్యూఢిల్లీ: బద్రీనాథ్ హైవేను అధికారులు మూసివేశారు. దీంతో మార్గమధ్యంలో 3వేల మంది యాత్రికులు చిక్కుకుపోయారు. బద్రీనాథ్ హైవేని వరుసగా మూడో రోజులపాటు పోలీసులు మూసివేశారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా బద్రీనాథ్ జాతీయ రహదారిపై విరిగి పడిన కొండ చరియలను తొలగించారు. దీంతో గురువారం నుంచి బద్రీనాథ్ జాతీయ రహదారిపై రాకపోకలు పున: ప్రారంభమైనాయి.
ఉత్తరాఖండ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతుండటం, ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. గర్వాల్ ప్రాంతంలో ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో చార్థామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు గార్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు.
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి.. హైదరాబాద్కు చెందిన ఇద్దరు యాత్రికుల ప్రాణాలను బలిగొన్నాయి. శనివారం బద్రీనాథ్ జాతీయ రహదారిపై కర్ణప్రయాగ్కు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.