Home » Uddhav Thackeray
ముంబైలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉండటంతో పార్టీ పరిస్థితిపై చర్చించేందుకు ఇటీవల మాతోశ్రీ నివాసంలో ఠాక్రే సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే పార్టీ కార్యకర్తలు, రౌత్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కంటే స్థానిక సంస్థల్లో పోటీకి ఎక్కువ మంది ఆశావహులు ఉన్నారని సంజయ్ రౌత్ చెప్పారు. బీజేపీతో అవిభక్త శివసేన పొత్తు ఉన్నప్పుడు కూడా బీఎంసీ, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో తమ పార్టీ స్వతంత్రంగానే పోటీ చేసిందని గుర్తుచేశారు.
'మహా వికాస్ అఘాడి'లోని తమ భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్కు ఉద్ధవ్ థాకరే హితవు పలుకుతూ, సావర్కర్ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ మాట్లాడటం మానుకోవాలని, బీజేపీ సైతం నెహ్రూను టార్గెట్ చేసి మాట్లాడవద్దని అన్నారు.
ఆదిత్య థాకరే ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వర్లి నియోజకవర్గం నుంచి 8,801 ఓట్ల ఆధిక్యతో గెలుపొందారు. ఆయనకు 63,324 ఓట్లు పోల్ కాగా, షిండే శివసేన నేత మిలంద్ దేవరకు 54,523 ఓట్లు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన నేత సందీప్ సుధాకర్ దేశ్పాండేకు 19,367 ఓట్లు పోలయ్యాయి.
అధికార మహాయుతి కూటమి, విపక్ష మహా వికాస్ అఘాడి మధ్య పోటీ నువ్వా-నేనా అనే రితిలో ఉండనుండదనే అంచనాల మధ్య ప్రధానంగా 5 నియోజకవర్గలపైనే అందరి దృష్టి నెలకొంది. ఇక్కడ పోటీ మహా సంగ్రామాన్నే తలపించనుందని చెబుతున్న ఆ నియోజకవర్గాలపై ఓ ఫోకస్.
బ్యాగ్ తనిఖీకి ఈసీ అధికారులు రావడంతో థాకరే ప్రశ్నలు కురిపించడం వీడియోలో కనిపిస్తోంది. ముందు తమను తాము పరిచయం చేసుకోమని థాకరే వారిని అడగంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బ్యాగ్లు ఇలాగే చెక్ చేస్తారా? అంటూ అధికారులను ప్రశ్నించారు.
మహారాష్ట్రలో రెబల్స్ బెడద వల్ల ఓట్లు చీలి పార్టీల గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో మమహాయుతి, మహా వికాస్ అఘాడి కూటములు తెరవెనుక నామినేషన్ల ఉపసంహరణకు ప్రయత్నాలు సాగించాయి. కొందరు అసంతృప్తి నేతలు ఆయా పార్టీలకు రాజీనామా చేశారు.
ఎన్సీపీ, శివసేనలో చీలికల తర్వాత మొదటిసారి శాసనసభ ఎన్నికల్లో పోటీపడుతున్నారు. పార్టీ చీలికల తర్వాత మహారాష్ట్ర రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. శివసేనలోని ఒక వర్గానికి ఏక్నాథ్ షిండే నేతృత్వం వహిస్తుండగా, మరో వర్గానికి ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం వహిస్తున్నారు. ఎన్సీపీ కూడా శరద్ పవార్, అజిత్ పవార్గా విడిపోయాయి. ఒకే పార్టీ రెండుగా చీలిపోవడంతో కొన్ని నియోజకవర్గాల్లో..
'ఇంపోర్ట్ మాల్' అంటూ సావంత్ మాట్లాడటంపై షైన ఎన్సీ అభ్యంతరం తెలిపారు. మహిళల గౌరవంపై జరుపుతున్న దాడిగా దీనిని పేర్కొన్నారు. శివసేన (యూబీటీ) నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశించారు. గతంలో సావంత్ తనను కూడా ప్రచారం కోసం తీసుకువెళ్లారని గుర్తుచేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 'మహా వికాస్ అఘాడి' కూటమి పొత్తుల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతుండటంతో తాజాగా ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది.