Home » TwitterX
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్పై తుపాకి కాల్పుల్లో కుట్ర కోణం ఉందా? అమెరికా ఎన్నికలకు మరో 3 నెలల సమయం ఉండగానే రాజకీయ లబ్ధి కోసమే రిపబ్లికన్లు ఇలా చేశారా? ఇవే అనుమానాలను ప్రస్తుతం కొందరు నెటిజన్లు లేవనెత్తుతున్నారు.
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రధాని మోదీ మరో చరిత్ర సృష్టించారు. ఆయన ఎక్స్ ఖాతాను(@narendramodi) అనుసరిస్తున్న వారి సంఖ్య తాజాగా 100 మిలియన్లకు చేరింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో మోదీ అగ్ర స్థానంలో నిలవగా.. ఎక్స్ ద్వారా ఆయన మరో రికార్డు నెలకొల్పారు.
దేశంలో మూడు అతిపెద్ద టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా.. తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలను విపరీతంగా పెంచాయి. దీంతో సామాన్యులు రీఛార్జ్ మాటెత్తితేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గణనీయమైన ధరల పెంపు వినియోగదారులపై తీవ్రంగా ప్రభావం చూపింది.
హ్యాకర్లు బ్యాంకుల అధికారిక సోషల్ మీడియా అకౌంట్లనూ వదలట్లేదు. తాజాగా కెనరా బ్యాంక్ అధికారిక సోషల్ మీడియా(Canara Bank X account hacked) హ్యాండిల్ X అకౌంట్ హ్యాక్కి గురైంది. హ్యాకర్లు అధికారిక ఎక్స్ హ్యాండిల్ పేరును 'ether.fi'గా మార్చారు.
ఈవీఎంలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ (Minister Nara Lokesh) కౌంటర్ ఇచ్చారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు గెలిస్తే ఈవీఎం(EVM)లు బాగా పని చేసినట్లు, 2024లో ఓడిపోతే ఈవీఎంలపై నింద మోపుతావా? అంటూ ఎక్స్లో పోస్టు పెట్టారు.
సాధారణంగా ఆస్తులు, స్థలాలు, వస్తువులను వేలం పాట వేయడం అందరికీ తెలిసే ఉంటుంది. కానీ రూ.10 నోట్లను వేలంపాట వేయడం ఎక్కడైనా చూశారా ? కనీసం విన్నారా? కానీ ఇప్పుడు అదే జరుగుతోంది. రెండు రూ.10 నోట్లకు లక్షలు పలుకుతున్నాయి.
వాట్సప్ భద్రత విషయంలో ఎలాన్ మస్క్(Elon Musk) చేసిన ఆరోపణలను వాట్సప్ (WhatsApp) చీఫ్ విల్ క్యాత్కార్ట్ ఖండించారు. వాట్సప్.. వినియోగదారుల భద్రత విషయంలో రాజీపడబోదని స్పష్టం చేశారు. ప్రతీ రాత్రి యూజర్ డేటాను ఎక్స్పోర్ట్ చేస్తుందంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవలే తన ఎక్స్ అకౌంట్లో రాసుకొచ్చారు.
సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్ ఇక పూర్తిగా ‘ఎక్స్’గా మారిపోయింది. ట్విటర్ పేరును ఎక్స్గా మారుస్తున్నట్లు ఆ సంస్థ అధినేత ఈలన్ మస్క్ గతంలోనే ప్రకటించి లోగోను మార్చినా..
బీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27న 24 వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఇన్నాళ్లు ఫేస్ బుక్కే పరిమితమైన కేసీఆర్ ఇవాళ సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్ ఫాంలైన ఎక్స్, ఇన్ స్టాగ్రామ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇకపై సోషల్ మీడియాని ఫుల్గా వాడేసుకోవడానికి రెడీ అయిపోయారన్నమాట.
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో ఏఐ(AI) టెక్నాలజీ అనేక రంగాలను ప్రభావితం చేస్తోంది. దీని ప్రభావం ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగంపై పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.