Home » Twitter
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలవడం ఎంతో సంతోషంగా ఉందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, జల వనరుల సంరక్షణపై ఆయనకు స్పష్టమైన ఆలోచనా విధానాలు ఉన్నాయంటూ రేవంత్ రెడ్డిని పవన్ కొనియాడారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. దేశవ్యతిరేకంగా మాట్లాడటం, దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న శక్తులకు అండగా నిలవడం రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని విమర్శించారు.
స్వాతంత్ర్య భారతదేశంలోనే రైతు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్(Congress) అతి పెద్ద మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు మాయమాటలు చెప్పి రైతులను నిండా ముంచారని కేటీఆర్ మండిపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar)కు భారీ షాక్ తగిలింది. ఇవాళ(సోమవారం) ఉదయం ఆయన ఎక్స్(X) ఖాతాను కేటుగాళ్లు హ్యాక్ చేశారు. ఆ సమయంలో కొన్ని అసభ్యకర వీడియోలను పోస్టు చేశారు.
తెలంగాణలో డెంగ్యూ(Dengue) మరణాలు, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్ల నాణ్యతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు డెంగ్యూ మరణాలే లేవంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ఆడుతోందంటూ మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) దుష్ట పాలన చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా మండిపడ్డారు.
బిలయనీర్ ఎలాన్ మస్క్(Elon Musk) మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫాం X (ట్విట్టర్) యాప్ని వేరే స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఈ యాప్ను పూర్తిగా మార్చేశారు. అనేక ఫీచర్లలో మార్పులు చేశారు. కానీ ఎలాన్ మస్క్ మాత్రం ఇప్పటికీ ఉపశమనం పొందలేదు. ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్ X యాప్ నుంచి మరో ఫీచర్ రానున్నట్లు తెలుస్తోంది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు తమ ప్రాణాలకు తెగించి నీటిలోకి దిగి బాధితులను కాపాడుతుంటారు. మరికొందరు..
లక్నో ఐఐటీ(IIT Lucknow)లో చదవాలన్న ఓ పేద విద్యార్థి కలను ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) నెరవేర్చారు. లక్నో ఐఐటీలో కోర్సు ఫీజు రూ.4లక్షలు ఉందని, అంత ఖర్చు భరించే స్థితిలో తల్లిదండ్రులు లేరని ఎక్స్(ట్విటర్) వేదికగా లోకేశ్కు విద్యార్థి విన్నవించారు. దీనిపై స్పందించిన మంత్రి ఫీజు విషయం తాను చూసుకుంటానని చదువుపై దృష్టి పెట్టాలంటూ రీట్వీ్ట్ చేశారు.
Andhrapradesh: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మిని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కలిసినట్టుగా ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. విజయమ్మను జేసీ కలవడానికి కారణమేంటి?.. రాజకీయన పరమైన అంశాలు ఏమన్నాయ ఉన్నాయా? వీరి కలయికతో రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుందా?.. అంటూ అనే ప్రశ్నలు కూడా జోరుగా వినిపించాయి. అయితే ఈ అంశం తీవ్ర చర్చకు దారి తీయడంతో జేసీ ముందుకు వచ్చారు.