Home » Twitter
తెలుగు ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. మంచిపై చెడు గెలిచిన సందర్భంగా దసరా పండగ నిర్వహించుకుంటారని మంత్రి లోకేశ్ తెలిపారు.
కొందరు మాత్రమే తమ అడుగుజాడలు వెళుతూ వెళుతూ ఈ భూమిపై వదిలి వెళతారని, తమ దూరదృష్టి, సమగ్రతలతో రతన్ టాటా అదే చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మనం కేవలం ఒక గొప్ప వ్యాపారవేత్తనే కాదు గొప్ప మానవతావాదిని కోల్పోయామని, కేవలం పారిశ్రామిక వారసత్వంలోనే కాకుండా ఆయన అందరి హృదయాలను స్పృశించి వెళ్ళారన్నారు.
కర్ణాటకలో ఐదు, తెలంగాణలో ఆరు గ్యారెంటీలంటూ అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్.. హరియాణలో ఏడు గ్యారెంటీలని మభ్యపెట్టే ప్రయత్నాన్ని ఆ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
వందలాది మంది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా ఈ ప్రభుత్వంలో చలనం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోయి లేదని.. ప్రభుత్వానికి బాధ్యత లేదని కేటీఆర్ తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. దసరా పండుగ వేళ.. వ్యవసాయాన్ని దండగలా మార్చిందని.. సీఎం రేవంత్ రెడ్డికి రైతన్నల చేతిలో దండన తప్పదని అన్నారు.
మంత్రి నారా లోకేశ్ కాన్వాయ్లోని ఓ కారు ప్రమాదవశాత్తూ మరో కారును ఢీకొట్టింది. దీంతో రెండు కార్లూ స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఇద్దరి వాహనాల డ్రైవర్లకు ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
వికారాబాద్ జిల్లా దామగుండం అడవులు అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లపాటు దామగుండం అడవులు కేంద్రానికి అప్పగించేందుకు తాము ఒప్పుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు.
అమృత్ పథకానికి టెండర్లు పిలిచి అర్హత లేని వారికి కాంట్రాక్టులు కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీలకే కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధితులకు ప్యాకేజీ ప్రకటించారు. ఈ మేరకు ప్యాకేజీ వివరాలతో కూడిన సమాచారాన్ని తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలవడం ఎంతో సంతోషంగా ఉందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, జల వనరుల సంరక్షణపై ఆయనకు స్పష్టమైన ఆలోచనా విధానాలు ఉన్నాయంటూ రేవంత్ రెడ్డిని పవన్ కొనియాడారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. దేశవ్యతిరేకంగా మాట్లాడటం, దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న శక్తులకు అండగా నిలవడం రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని విమర్శించారు.