Home » Tungabhadra
ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నీటి ప్రాజెక్టుగా ఉన్న తుంగభద్ర జలాశయం (టీబీ డ్యామ్) ప్రమాదంలో పడింది. డ్యామ్కి అమర్చిన 19వ క్రస్ట్గేట్ చైన లింక్ తెగిపోయి, శనివారం రాత్రి కొట్టుకుపోయింది. దీంతో డ్యామ్లోని నీటిని నదికి వదిలేస్తున్నారు. సుమారు 65 టీఎంసీల మేర నీరు నదికి విడుదల చేయనున్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి ఓఆర్కే రెడ్డి, ఎస్ఈ శ్రీకాంతరెడ్డి తెలిపారు. డ్యామ్లో నీటి నిల్వ 40 టీఎంసీలకు తగ్గితేనే కొత్త క్రస్ట్గేట్ అమర్చడానికి అవకాశం ఉంటుందని బోర్డు ఇంజనీర్లు తెలిపారు. డ్యామ్కి మొత్తం ...
అధికారుల నిర్లక్ష్యంతో డ్యామ్ గేటు ఊడింది. కర్ణాటకలో హోస్పేట్ వద్ద ఈ ఘటన జరిగింది. తుంగభద్ర డ్యామ్ 19వ గేటు నిన్న రాత్రి (శనివారం) ఊడిపోయింది. డ్యామ్ ఇన్ ఫ్లో తగ్గడంతో రాత్రి డ్యామ్ గేట్లు మూసివేసేందుకు ప్రయత్నించారు. దాంతో 19వ గేటు చైన్ తెగింది. దీంతో అధికారులు ఆందోళన చెందారు. గేటు తీసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. గేటు తెగడంతో నీటి ప్రవావం పోటెత్తింది.
ఇంటిముందర చెరువు ఉన్నా, తాగడానికి మాత్రం నీళ్లు లేని పరిస్థితి హోస్పేట నగర(Hospet city) ప్రజలది. వారికి సమీపంలోనే టీబీ డ్యాం(TB dam) ఉన్నా నగరానికి తాగునీటి సరఫరాలో అన్నీ అడ్డంకులే.
Andhrapradesh:
తుంగభద్ర జలాశయానికి(Tungabhadra reservoir) మళ్లీ వరద పోటెత్తుతోంది. దీంతో 33 క్రస్ట్గేట్లు (25 గేట్లు మూడు అడుగులు, మరో 8 గేట్లు ఒక్క అడుగు మేర)ను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. 1,23,381 క్యూసెక్కు ల నీటిని తుంగభద్ర నదికి, 9379 క్యూసెక్కులను కాలువలకు విడుదల చేశారు. జలాశయం పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ వరదనీరు వచ్చి జలాశయంలోకి చేరుతున్నాయి.
రైల్వేస్టేషన్లో పట్టాలు దాటుతున్న ప్రయాణికుడిని రైలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station)లో మంగళవారం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ అంబేడ్కర్ కాలనీ(Nizamabad Ambedkar Colony)కి చెందిన వెంకట రమణ(45) ప్రైవేట్ ఉద్యోగి. రెండు రోజుల క్రితం హైద్రాబాద్కు వచ్చాడు.
నిరుటి ఇబ్బందికర పరిస్థితి మళ్లీ తలెత్తకుండా చేస్తూ.. వానాకాలం పంటలకు ఊపిరి పోస్తూ.. శ్రీశైలం నుంచి కృష్ణమ్మ దిగువకు పరుగులు పెట్టనుంది. జూలై నెలలోనే బిరబిరా తరలివస్తూ.. నాగార్జున సాగర్ను చేరనుంది.
తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir) నుంచి అత్యధిక స్థాయిలో నీరు నదికి విడుదల చేయడంతో కంప్లి, గంగావతి మధ్య రాకపోకలను అధికారులు ఆపివేశారు. జలాశయం నుంచి 30 గేట్ల ద్వారా నదికి 1,07,096 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో నీరు వంతెనను తాకుతూ ప్రవహిస్తోంది.
తుంగభద్ర జలాశయానికి వరదనీరు పోటెత్తడంతో మొత్తం 32 గేట్ల క్రస్ట్గేట్ల(20 గేట్లు రెండున్నర అడుగులు, మరో 12 గేట్లు రెండు అడుగుల మేర)ను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 1,07,096 క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నదికి, 8952 క్యూసెక్కు లను కాలువలకు విడుదల చేశారు. తుంగభద్ర జలాశయం పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం డ్యాంకు ఇనఫ్లో 1,05,378 క్యూసెక్కులుండగా ఔట్ఫ్లో కాలువలకు వదిలే నీటితో కలిపి 1,16,228 క్యూసెక్కులు ఉంది. డ్యాం ...
తుంగభద్రమ్మ ఉగ్రరూపం దాల్చింది. కర్ణాట, ఆంధ్రప్రదేశ్(Karnataka, Andhra Pradesh) రైతుల జీవనాడి నిండుకుండలా తొణికిసలాడుతోంది. డ్యాం పైప్రాంతం నుంచి జలాశయంలోకి ఇన్ఫ్లో 80 వేలకు పైగా క్యూసెక్కులుగా నమోదయ్యింది.