Home » TS Politics
సార్వత్రిక ఎన్నికల్లో(Lok Sabha Polls 2024) భాగంగా నాలుగో విడత పోలింగ్కు సంబంధించి ప్రచారపర్వం ముగిసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం(Andhra Pradesh) ముగియడంతో.. రాష్ట్రం అంతా ప్రశాంతంగా మారింది. అధికార వైసీపీ ఒకవైపు..
మాజీ సీఎం కేసీఆర్ (KCR) అంటే భయంతోనే కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం రైతు బంధును మళ్లీ మొదలుపెట్టిందని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి (Ravula Sridhar Reddy) అన్నారు. రైతు బంధును ఎన్నికల కమిషన్ ఆపమని చెప్పిందని అబ్బద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రైతు బంధు విషయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు నిజమా భట్టి విక్రమార్క మాటలు నిజమా అని ప్రశ్నించారు.
తెలంగాణలో రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సోమవారం రైతుభరోసా(రైతుబంధు) నిధులు విడుదల చేసింది. ఐదు ఎకరాలకు పైబడి ఆరెకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసింది. 39 లక్షల ఎకరాలకు గానూ రూ. 2000 కోట్ల నిధుల బకాయిలు ఉన్నట్లు గతంలో వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.
ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది తెలంగాణలో(Telangana) రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవలి కాలంలో వ్యక్తిగత విమర్శలకు సైతం వెనుకాడటం లేదు. తాజాగా 6 గ్యారెంటీల విషయంలో కేటీఆర్పై(KTR) సీఎం రేవంత్(CM Revanth Reddy) తీవ్ర విమర్శలు చేయగా..
ఆయన ఓ పార్టీ అగ్ర నేత.. స్వయంగా ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎండ దంచేస్తున్నప్పటికీ.. నామినేషన్ వేసిన ఉత్సాహంలో రోజంతా ప్రచారంలో పాల్గొన్నారు..
Telangana: తెలంగాణలో ఎక్కడ చూసినా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కనిపిస్తోంది. ఎవరి నోట విన్నా అదే విషయం వినిపిస్తోంది. ఈ కేసులో రోజు రోజుకు అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా ఫోన్ట్యాపింగ్ కేసులో ఏ4గా ఉన్న టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధా కిషన్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
బీజేపీలో ఖమ్మం ఎంపీ టికెట్ హీట్ పెంచుతోంది. టికెట్ హామీతోనే బీఆర్ఎస్కు గుడ్బై చెప్పిన జలగం వెంకట్రావు కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది.
తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న ప్రచారానాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. తనకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు.
పదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ‘తెలంగాణ బాపు’గా కొంతకాలం పాటు పిలిపించుకున్న మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ కుమార్తె కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు...
లోక్సభ ఎన్నికలకు (Lok Sabba polls) ముందు ముఖ్య నేతల జంపింగ్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీఆర్ఎస్కు (BRS) మరో గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. గులాబీ పార్టీకి చెందిన సీనియర్ నేత, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని ఊహాగానాలు వెలువడతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని శుక్రవారం ఎంపీ దయాకర్ కలిశారు. దీంతో పార్టీ మార్పు ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.