Home » Trending News
అర్హులకు మాత్రమే రేషన్ ఫలాలు అందడంతో పాటు బియ్యం పక్కదారి పట్టడానికి వీలులేదన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే క్షేత్రస్థాయిలో ఇందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితులు ఉంటున్నాయి. ఈకేవైసీ ప్రక్రియ నత్తనడకనే సాగు తుండటంతో అర్హత లేకపోయినా పలువురు లబ్ధి పొందుతున్నారని సమాచారం. ప్రజాధనం వృథాకు అడ్డుకట్ట పడాలంటే ఈ-కేవైసీతో పాటు క్షేత్రస్థాయి సర్వేతోనే సాధ్యమవుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నా..
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల్లో.. ఒక దానికి లబ్ధి చేకూరి, మరో పథకం వర్తించని రైతులు, రైతు సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ, వారి సందేహాలను నివృత్తి చేసే వారు కానరావడం లేదు. రెండు పథకాలకు ఒకే లబ్దిదారుల జాబితా లేదని అధికారులు చెప్పకనే చెబుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం రచ్చ నడుస్తోంది. అటు అధికార పార్, ఇటు ప్రతిపక్ష పార్టీల నాయకులు తగ్గేదేలే అంటూ.. మాటల యుద్ధం చేస్తున్నారు. తాజాగా కాళేశ్వరం నివేదికపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఏబీఎన్తో మాట్లాడారు.
నూటికి నూరు శాతం లిక్కర్ స్కాం జరిగింది.. ఇందుకు కారకులైన వారిని వదిలిపెట్టబోం. ఇందుకు కారకులైన వారిపై కూటమి ప్రభుత్వం కచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
రష్యాలో ఉదయం సంభవించిన భూకంపం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను బెంబేలెత్తిస్తోంది. జపాన్, అమెరికా సహా పలు తీరప్రాంతాలకు ఇప్పటికే సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో ప్రజలు నగరాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోవడంతో భారీ ట్రాఫిక్ జాం నెలకొంది.
రష్యాలో సంభవించిన భారీ భూకంపం జపాన్ సహా పసిఫిక్ మహాసముద్రం వెంబడి ఉన్న అనేక తీర దేశాలను బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే అమెరికా, జపాన్ వాతావరణ సంస్థలు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి.
ప్రియుడితో కలిసి భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపిన భార్య.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సాంబారులో విషం పెట్టి చంపిన భార్య.. హనీమూన్కు తీసుకెళ్లి భర్తను హతమార్చిన భార్య.. ఇవీ ఇటీవల తరచూ వినిపించే వార్తలు. ప్రియుడి మోజులో పడి.. కట్టుకున్న భర్త అని కూడా చూడకుండా దారుణంగా హతమారుస్తున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో..
కేరళ నర్సు నిమిష ప్రియ (Nimisha Priya) కేసు క్షణానికో మలుపు తిరుగుతోంది. యెమెన్ (Yemen) ప్రభుత్వం నిమిష ఉరిశిక్ష రద్దుకు అంగీకరించిందని వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం అవాస్తవమంటూ తోసిపుచ్చింది.
జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్ను బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో మొత్తం 18 మంది మృతి చెందారు. శ్రావణ మాసం కావడంతో ఉత్తరాది రాష్ట్రాల భక్తులు కన్వర్ యాత్రకు బయలుదేరారు.