Home » Trains
నగర రవాణాలో కీలకమైన మెట్రో రైళ్లలో కొత్త ఆఫర్లు కరువయ్యాయి. కొత్త సంవత్సరం ప్రారంభమై ఆరునెలలు దాటినా ఇప్పటి వరకు ప్రత్యేక రాయితీలను అందుబాటులోకి తీసుకురాలేదు. మెట్రోను అధికంగా వినియోగించే వారు డిస్కౌంట్ల కోసం ఎదురుచూస్తున్నారు.
వివిధ మార్గాల్లో నడిచే 54 ప్రత్యేక రైళ్లను అక్టోబరు 15 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-మధురై మార్గంలో 07191/07192 ప్రత్యేకరైళ్లు, హైదరాబాద్-కొల్లాం మార్గంలో 07193/07194, హైదరాబాద్-కన్యాకుమారి మార్గంలో 07230/07239 ప్రత్యేకరైళ్లను పొడిగించినట్లు సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.
Trains Schedule: కేకే లైనులో సాంకేతిక కారణాల వల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో కిరండూల్ రైళ్లతోపాటు హిరాకుడ్, సమలేశ్వర్, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతోపాటు కొరాపుట్ వరకే నడిపిస్తున్నామని సీనియర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు.
డీజిల్ ట్యాంకర్ల లోడ్తో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పటంతో ట్యాంకర్లు ఒకదానినొకటి ఢీకొని నిప్పంటుకుని భారీ అగ్నిప్రమాదం సంభవించింది...
దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైల్వేలో విప్లవాత్మక మార్పులొచ్చాయనీ, తాను పదవీబాధ్యతలు స్వీకరించిన స్వల్పకాలంలోనే రాష్ట్రంతో సహా అనేక ప్రదేశాలలో మరిన్ని రైళ్లు మంజూరయ్యాయని కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్న అన్నారు.
ఆగస్టు నెలలో తొమ్మిది ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రతీ శుక్ర, శని వారాల్లో చర్లపల్లి నుంచి తిరుపతికి (07017), ప్రతి సోమ, శనివారాల్లో తిరుపతి నుంచి చర్లపల్లికి (07018) రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఇప్పుడు కొత్తగా ప్రయాణికుల కోసం వీక్లీ టూరిజం ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. అదీ టికెట్ గ్యారెంటీ హామీతో. టూర్ ప్యాకేజీని బట్టి యాత్రికులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను దర్శించుకోవచ్చు.
IRCTC Ramayana Yatra Package: దేశవ్యాప్తంగా పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఎప్పటికప్పుడు సరికొత్త టూర్ ప్యాకేజీలను తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలోనే మరోసారి రామాయణ యాత్ర స్పెషల్ టూర్ ప్యాకేజీ ప్రారంభించనుంది. ఈ నెల జులై 25 నుంచి మొదలుకానున్న ఈ ఆధ్యాత్మిక యాత్రలో పర్యాటకులు 17 రోజుల్లోనే 30 ప్రముఖ రామక్షేత్రాలను దర్శించుకోవచ్చు.
ఒళ్లు గగుర్పొడిచే నిజాలు బయటకి వచ్చాయి. అయితే, ఇవన్నీ నివారించగలిగే అపాయాలే. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకూ ముంబై లోకల్ ట్రైన్స్ ప్రమాదాల్లో చనిపోయిన వారెంతమందో తెలుసా.. అక్షరాలా 922 మంది.
హైదరాబాద్(Hyderabad) నుంచి కన్నియాకుమారికి జూలై 2వ తేదీ నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.