Home » Trains
సికింద్రాబాద్-రేపల్లె మధ్య నడిచే రేపల్లె ఎక్స్ప్రెస్ రైలు ఇక చర్లపల్లి నుంచి బయలుదేరనుంది. ప్రయాణికుల రద్దీ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఏర్పడ్డ ఒత్తిడి కారణంగా సికింద్రాబాద్ కు బదులు చర్లపల్లికి మార్చినట్లు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 15 నుంచి ఇది అమలులోకి వస్తుందన్నారు.
ముంబై నుంచి దుబాయ్కి కేవలం 2 గంటల్లో చేరుకోవచ్చు.. అది కూడా విమానంలోకాదు. రైలులో. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది మాత్రం వాస్తవం అని.. భవిష్యత్తులో జరగబోయేది ఇదే అంటున్నారు. మరి ఇది ఎలా సాధ్యం అంటే..
రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్పై ఓ కానిస్టేబుల్ నిలబడి ఉంటాడు. అదే సమయంలో ఓ గూడ్స్ రైలు వెళ్తుంటుంది. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘మరణం ఇలాక్కూడా వస్తుందా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
ప్రస్తుత వేసవి, సెలవుల నేపధ్యంలో 52 వీక్లీ రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి దేశంలోని ఆయా ప్రాంతాలకు వీక్లీ రైళ్లను ఏర్పాటు చేశారు. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
రైళ్లలో కొందరు కుక్కలు, కోళ్లు, చిలుకలు తదితర జంతువులను తీసుకుని ప్రయాణించడం చూస్తుంటాం. అయితే తాజాగా, ఓ వ్యక్తి రైల్లో తీసుకెళ్లిన వస్తువు చూసి అంతా అవాక్కవుతున్నారు. బోగీలోకి ఎక్కిన ప్రయాణికులకు తలుపు వద్ద షాకింగ్ సీన్ కనిపించింది.
అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్ను నెక్కల్లు-పెదపరిమి వద్ద నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది
రైల్లో కిటికీ పక్కన కూర్చున్న ప్రయాణికులను టార్గెట్ చేసి ఫోన్లు లాక్కెళ్లే ఘటనలను చూస్తుంటాం. ఇలా జరగకుండా ఉండేందుకు ఓ వ్యక్తి వినూత్న ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
జన్మభూమి ఎక్స్ప్రెస్ (విశాఖపట్నం-లింగంపల్లి) రైళ్లు ఈ నెల 25 నుండి చర్లపల్లి-అమ్ముగుడ-సనత్నగర్ మీదుగా ప్రయాణాలు ప్రారంభిస్తాయని సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.
రైలులో ప్రయాణిస్తున్న బాలికపై ఓ కీచకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా వీడియో కూడా తీశాడు. నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. బాలిక బాత్రూమ్కు వెళ్లిన సమయంలో తోటి ప్రయాణికుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
మీరు రైలులో ప్రయాణిస్తున్న క్రమంలో అనుకోకుండా మీ ఫోన్ పోయిందా, అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇలాంటి విషయంలో టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కలిసి కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.