Home » Train Accident
ముచ్చటగా మూడో సారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం దేశవ్యాప్తంగా పలు దుర్ఘటనలు భారీ ఎత్తున చోటు చేసుకుంటున్నాయి. వాటిలో రైలు ప్రమాదాలు ఒకటి. ఒడిశాలోని బాల్సోర్లో భారీ రైలు ప్రమాదం జరిగింది. అనంతరం పలు రైలు ప్రమాద ఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి.
తమిళనాడు మైసూరు-దర్భంగా బాగమతి ఎక్స్ప్రెస్ ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకంగానే జరిగిందని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో విచారణను రైల్వేశాఖ ఎన్ఐఏకు అప్పగించింది. ఈ క్రమంలో హెల్ప్ లైన్ నంబర్లను కూడా ప్రకటించారు.
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపేట రైల్వేస్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వైద్య చికిత్స కోసం సమీపంలో ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తుంది.
దేశవ్యాప్తంగా ఇటీవల వివిధ ప్రాంతాల్లో రైలు ప్రమాదాలు భారీగా చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలు నివారించేందుకు రైల్వే బోర్డు తీవ్రంగా కసరత్తు చేస్తుంది. మరోవైపు రైల్వే ట్రాక్లపై గ్యాస్ బండలు, సిమెంట్ దిమ్మలు, ఐరన్ రాడ్లు వేస్తూ.. కొన్ని అసాంఘిక శక్తులు రైలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
లలిత్పూర్ స్థానిక రైల్వే యంత్రాంగం పొరపాటు కారణంగా దెబ్బతిన్న ట్రాక్పైకి రైలు వెళ్లింది. పట్టాలపై సిబ్బంది పనులు చేస్తుండగా రైలు రావడంతో వెంటనే వారు ఎర్రజెండా ఊపారు.
గుజరాత్లో రైలును పట్టాలు తప్పించేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ప్రయత్నం లైన్మ్యాన్ అప్రమత్తత కారణంగా విఫలమయింది.
రాజస్థాన్,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రైళ్లను పట్టాలు తప్పించడమే లక్ష్యంగా చోటుచేసుకున్న ఘటనలు కలకలం సృష్టించాయి. ఇది ఉగ్రవాదుల కుట్రేనని అనుమానిస్తున్నారు. మంగళవారం రాజస్థాన్లోని అజ్మేర్ జిల్లాలోని పశ్చిమ రవాణా కారిడార్లో లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలును పట్టాలు తప్పించే యత్నం జరిగింది.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో కాళింది ఎక్స్ప్రె స్కు పెను ప్రమాదం తప్పింది. ప్రయాగ్రాజ్ నుంచి హరియాణాలోని భివాని వెళ్తున్న ఈ రైలు ఆదివారం రాత్రి శివరాజ్పూర్ సమీపంలో పట్టాలపై గ్యాస్ సిలిండర్ను అతి వేగంగా ఢీ కొట్టింది.
న్యూఢిల్లీ నుంచి బిహార్లోని ఇస్లాంపూర్కు వెళ్తున్న మగధ్ ఎక్స్ప్రెస్ రెండుగా విడిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
బిహార్లో మగధ్ ఎక్స్ప్రెస్కు తృటిలో ప్రమాదం తప్పింది. బాక్సర్ జిల్లాలోని ట్వినిగంజ్ - రఘునాథ్పూర్ స్టేషన్ల మధ్య న్యూఢిల్లీ నుంచి ఇస్లాంపూర్ వెళ్తున్న మగధ్ ఎక్స్ప్రెస్ రైలు రెండు భాగాలుగా విడిపోయింది.