Home » TPCC Chief
హైదరాబాద్: తెలంగాణ ప్రస్థానాన్ని మూడు భాగాలుగా చూడాల్సి ఉంటుందని, నిజాం నిరంకుశ పాలన... సమైక్య పాలకుల ఆధిపత్యం.. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన విధ్వంసం.. అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
వికారాబాద్ జిల్లా: బీఆర్ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, భూములకు పట్టాల పంపిణీ జరిగిందని, తమ హయాంలోనే బొంరాస్ పేట్ అభివృద్ధి చెందిందని టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
చీకట్లో మగ్గుతున్న రామగుండంలో వెలుగులు రావాలంటే కాంగ్రెస్ గెలవాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరిస్తే రెండు గంటల్లోనే కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరుపుతుందంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్రెడ్డి చేసిన ప్రకటనిపై సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు స్పందించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా ఈరోజు (బుధవారం) ఉట్నూర్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రజా గర్జన సభలో టీపీసీసీ చీఫ్ పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం బాగుపడాలని తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఇవ్వలేదన్నారు.
తెలంగాణ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చుక్క మందు, డబ్బు లేకుండా వెళదామని అధికార బీఆర్ఎస్ పార్టీతో సహా ఇతర పార్టీలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. విధివిధానాలపై ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళదామని తెలిపారు.
: మంత్రి కేటీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను కందిపప్పు లాంటివాన్ని.. ఆరోగ్యానికి మంచిది. కానీ కేటీఆర్ గన్నేరు పప్పు లాంటివారు.. తింటే చస్తారు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్పై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అంటే కాళేశ్వరం కర్రెప్షన్ రావు అనే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యలు చేశారు. నాసిరకం పనులతో వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని మండిపడ్డారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయన్నారు.
తొడలు కొట్టి భుజాలు ఎగిరేసిన వాళ్లు కేసీఆర్ వస్తుండడంతో ముఖం చాటేశారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మాచారెడ్డి మండల కేంద్రంలో రామారెడ్డి, మాచారెడ్డి మండలాల కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ మీద పోటీ చేసేందుకు భయపడుతున్నారన్నారు. కొడంగల్లో గెలవలేని రేవంత్ రెడ్డి కామారెడ్డిలో గెలుస్తాడా అని ప్రశ్నించారు.