Home » TMC
పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీలోని నేతలు ఇబ్బందుల్లోకి నెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. మొన్న సందేశ్కాలీ, నిన్న చోప్రా.. నేడు కోల్కతా మహానగరం.
పశ్చిమబెంగాల్లో లోక్సభ ఎన్నికల తర్వాత వచ్చిన 4 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లోనూ టీఎంసీ సత్తా చాటుకుంది. శనివారం మధ్యాహ్నం వరకూ వెలువడిన ఫలితాల్లో 3 నియోజకవర్గాల్లో టీఎంసీ గెలుపొందినట్టు అధికారికంగా ప్రకటించగా, మరో నియోజకవర్గంలోనూ ప్రధాన ప్రత్యర్థి పార్టీ బీజేపీపై టీఎంసీ భారీ ఆధిక్యత కొనసాగుతోంది. దీంతో టీఎంసీ క్లీన్ స్వీప్ దాదాపు ఖాయమైనట్టు చెబుతున్నారు.
తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మరోసారి ఉప ఎన్నికల బరిలో హోరాహోరీగా తలబడనున్నాయి. పశ్చిమబెంగాల్ లోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు ఈనెల 10వ తేదీన పోలింగ్ జరగనుండటంతో గెలుపుపై రెండు పార్టీలు గట్టి ధీమాతో ఉన్నాయి.
ప్రతిపక్ష నేతల కేసుల్లో న్యాయమూర్తులు న్యాయం చేయడానికి భయపడుతున్నారని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు.
పశ్చిమబెంగాల్ లోని అధికార టీఎంసీకి, గవర్నర్ సీవీ ఆనంద బోస్ మధ్య కొనసాగుతున్న విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా బారానగర్ నుంచి ఎన్నికైన సయాంతిక బెనర్జీ, భగవాన్గోల నుంచి ఎన్నికైన రెయత్ హుస్సేన్ సర్కార్ల చేత స్పీకర్ బిమన్ బెనర్జీ శుక్రవారంనాడు ప్రమాణ చేయించారు. దీంతో గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ కన్నెర్ర చేశారు.
ఉత్తర దినాజ్పూర్లోని చోప్రాలో అక్రమ సంబంధం పెట్టుకున్నారంటూ ఓ జంటపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటనలో మరో వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అమిరుల్ ఇస్లాం అలియాస్ బదువాను ఈ రోజు ఉదయం బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్ అధికారుల బృందం అరెస్ట్ చేసింది.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తై.. ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఐదేళ్ళ వైసీపీ పాలన చూసిన ప్రజలు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అధికారం కట్టబెట్టారు.
ప్రజల ఆశీస్సులతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏపీలో ఘన విజయం సాధించిందని నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి(MP Byreddy Shabari) పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా ఆమె లోక్సభ (Loksabha)లో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu)ను ఉద్దేశించి టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ(TMC MP Kalyan Banerjee) ఉదయం సభలో చేసిన వ్యాఖ్యలను తొలుత ఆమె తీవ్రంగా ఖండించారు.
తనను టార్గెట్ చేసి సభ నుంచి బహిష్కరించినందుకే లోక్ సభలో బీజేపీకి 63 మంది సభ్యుల బలం తగ్గిందని తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra)దుయ్యబట్టారు.
ఎన్డీయే సర్కార్ మూడో సారి అధికారం చేపట్టిన తరువాత సోమవారం తొలి పార్లమెంటు సమావేశాలు(Parliament Sessions) ప్రారంభమయ్యాయి. బీజేపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్తో సహా ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు.