Home » TMC
సోనార్పూర్లో తనపై జరిగిన దాడిని టీఎంసీ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఖండించారు. తనపై జరిగిన దాడిని రాజకీయ హింసగా అభివర్ణించారాయన.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి జరిగింది. చందితల పోలీస్ స్టేషన్ బయట ఆయనపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు.
పశ్చిమబెంగాల్లో సుదీర్ఘ పాలనకు తెరపడటంతో చిక్కుల్లో పడిన మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మరిన్ని చిక్కులు తప్పలే కనిపించడం లేదు. ఆ పార్టీకి చెందిన సుమారు 20 మంది ఎంపీలు, 50 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ తాజాగా బాంబు పేల్చారు.
తృణమూల్ కాంగ్రెస్లో నెంబర్-2గా ఉన్న ఆ పార్టీ డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ నివాసానికి సోమవారంనాడు పెద్దఎత్తున కోల్కతా పోలీసులు చేరుకున్నారు. అభిషేక్ బెనర్జీ ఆస్తులకు సంబంధించి టీఎంసీ నిర్వహణలోని కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల నోటీసులు జారీ చేసింది.
మరో రెండ్రోజుల్లో ఫల్తా నియోజకవర్గం ఉప ఎన్నిక జరుగనున్న తరుణంలో టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ తన నామినేషన్ను మంగళవారంనాడు ఉపసంహరించుకోవడం సంచలనమైంది. దీనిపై టీఎంసీ తీవ్ర స్థాయిలో బీజేపీపై విరుచుకుపడింది. బీజేపీ ఒత్తిడి రాజకీయాలే ఇందుకు కారణమని మండిపడింది.
గురువారం న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మీటింగ్కు మహువా మొయిత్రా ఢిల్లీ బయలుదేరారు. ఇండిగో విమానంలో ఆమె ఢిల్లీకి వెళుతుండగా.. కొంతమంది ప్రయాణికులు ఆమెతో తప్పుగా ప్రవర్తించారు. టీఎంసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ నాయకుడు సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడిని గుర్తుతెలియని దుండగలు కాల్చి చంపేశారు. ఈ ఘటన ఉత్తర 24 పరగణాల జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పశ్చిమబెంగాల్లో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. కోల్కతాలోని ప్రసిద్ధ న్యూ మార్కెట్ ప్రాంతంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయాన్ని బుల్డోజర్తో కూల్చివేయడం తీవ్ర కలకలం రేపింది.
బెంగాల్లో అఖండ విజయం అనంతరం సీఎం రేసులో ముందు వరుసలో ఉన్న సువేందు అధికారి స్పందించారు. ఆప్లాగే టీఎంసీ అవినీతిమయమైందని, ఆ పార్టీ పతనం ఖరారైందని ఆయన విమర్శించారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార తృణముల్ కాంగ్రెస్ (TMC) అనూహ్యంగా ఓటమి పాలవడంతో, మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు ప్రజా తీర్పు కాదని, ఇది పూర్తిగా 'లూటీ' అని ఆమె ఆరోపించారు.