Home » TMC
పశ్చిమ బంగా ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సారి జరగబోయే లోక్సభ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తామని వెల్లడించారు.
పశ్చిమబెంగాల్లో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు ఆదివారం రోజున అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నేత సత్యన్ చౌదరి హత్యకు గురయ్యారు.
పశ్చిమబెంగాల్ నుంచి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో సీట్ల షేరింగ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో టీఎంసీ మరోసారి పార్టీ వైఖరిని స్పష్టం చేసింది. 'ఓపెన్ హార్ట్'తో కాంగ్రెస్తో మాట్లాడేందుకు సిద్ధమేనని, చర్చలు విఫలమైతే మాత్రం ఒంటిరిగా పోటీ చేసేందుకు కూడా సిద్ధమని తెలిపింది.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం రేషన్ కుంభకోణం(Ration Scam) ప్రకంపనలు రేపుతోంది. అధికార టీఎంసీ(TMC) నేతల్లో వణుకు పుట్టిస్తోంది. రేషన్ పంపిణీ కుంభకోణంలో నార్త్ 24 పరగణాస్ జిల్లా బంగావ్ మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్, తృణమూల్ కాంగ్రెస్ (TMC) నాయకుడు శంకర్ ఆదిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఇవాళ అరెస్టు చేసింది.
రేషన్ పంపిణీ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు శంకర్ అధ్యాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. విస్తృత సోదాల అనంతరం బంగాన్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ అయిన శంకర్ అధ్యాను ఈడీ అదుపులోకి తీసుకుంది.
ఈడీ అధికారులపై పశ్చిమ బెంగాల్లో జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలు అదుపులో లేవనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏమి కావాలని అడిగింది.
తమ నేతను తీసుకెళ్తున్నారన్న కోపంతో ఓ గ్రామస్థులు ఈడీ అధికారులపై దాడికి పాల్పడిన ఘటన పశ్చిమబెంగాల్ లో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్త్ 24 పరగణాల జిల్లాకి చెందిన టీఎంసీ(TMC) నాయకుడు షాజహాన్ షేక్(రేషన్ కుంభకోణం)(Ration Scam) విచారణనిమిత్తం ఈడీ అధికారులు గ్రామానికి వచ్చారు. అనంతరం ఆయన్ని ఈడీ ఆఫీసులో విచారణకు రావాలని కోరుతూ.. తమ కారులో తీసుకెళ్లారు.
తృణమూల్ కాంగ్రెస్ నేత మహువ మొయిత్రాపై లోక్సభ బహిష్కరణ వేటు పడిన వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె వేసిన పిటిషన్పై లోక్సభ సెక్రటరీ జనరల్కు సుప్రీంకోర్టు బుధవారంనాడు నోటీసులు పంపింది. ముూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయిన టీఎంసీ నేత మహువా మొయిత్రా అధికార నివాసం కూడా ఖాళీ చేయాల్సి రావడంతో ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె వేసిన పిటిషన్పై విచారణను ఢిల్లీ హైకోర్టు మంగళవారంనాడు వాయిదా వేసింది. పిటిషన్పై 'స్టే' ఇచ్చేందుకు నిరాకరిస్తూ తదుపరి విచారణను 2024 జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది.
డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. పార్లమెంటు నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదికను లోక్సభ ఆమోదించింది.