Home » TMC
దేశంలో తొలి అండర్ రివర్ మెట్రో రైలును ప్రధాని మోదీ బుధవారం కోల్ కతాలో ప్రారంభించారు. కోల్ కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద హుగ్లీ నది దిగువన రైలు మార్గాన్ని నిర్మించారు. ఇందుకోసం రూ.120 కోట్ల ఖర్చు చేశారు. కోల్ కతా ఈస్ట్ వెస్ట్ మధ్య 16.6 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని నిర్మించారు. 10.8 కిలోమీటర్లు భూగర్గంలో ఉంది.
బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. సందేశ్ ఖాళి ఘటనతో నెలకొన్న ఆందోళనతో బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. అంతకుముందు జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కూడా ఇలాంటి ప్రతిపాదన చేశారు.
ఈడీ అధికారులపై దాడికి సంబంధించిన సందేశ్ఖాలి ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ కోల్కత్తా హైకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. దాడి కేసు నిందితుడుషేక్ షాజహాన్ ను మంగళవారం మధ్యాహ్నం 4.30 గంటల కల్లా సీబీఐకి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది.
లోక్ సభ ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, బరానగర్ ఎమ్మెల్యే తపాస్ రాయ్ రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవీతోపాటు, పార్టీకి రాజీనామా సమర్పించారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ సుదీప్ బెనర్జీని అరెస్ట్ చేయాలని ఆ పార్టీ నేత కునాల్ ఘోష్ డిమాండ్ చేశారు. కోల్ స్కామ్ కేసులో సుదీప్ బెనర్జీ హస్తం ఉందని కునాల్ ఘోష్ ఆరోపించారు. కోల్ స్కామ్లో జరిగిన అవకతవకలపై సీబీఐ, ఈడీ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీపై (దీదీ) భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సమయానికి అనుకూలంగా నడుచుకోవడంతో దీదీ నంబర్ వన్ అని మండిపడింది.
సందేశ్ ఖాళీలో మహిళలపై వేధింపులు, భూ ఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత షేక్ షాజహాన్ను ఎట్టకేలకు బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని తమిళ మానిలా కాంగ్రెస్ పార్టీ అధినేత జీకే.వాసన్ ప్రకటించారు. ఈ మేరకు ఎన్డీఏ కూటమిలో చేరుతున్నట్లు వెల్లడించారు.
సార్వత్రిక సమరానికి సమయం దగ్గరపడుతున్న వేళ.. టీఎంసీ(TMC) భారీ ర్యాలీ చేపట్టడానికి నిర్ణయించింది. మార్చి 10న కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో తృణమూల్ కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించనుంది.
'ఇండియా' కూటమి పార్టీలతో పొత్తులను కొలిక్కి తెస్తున్న కాంగ్రెస్ పార్టీ పశ్చిమబెంగాల్ లోనూ అధికార తృణమూల్ కాంగ్రెస్ తో పొత్తు ఖరారుకు మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. 5 లోక్సభ సీట్లు కావాలని కాంగ్రెస్ మొదట్నించీ పట్టుపడుతుండగా, రెండు సీట్లు మినహా ఇవ్వలేమంటూ టీఎంసీ కరాఖండిగా చెబుతూ వస్తోంది.