Home » Tirumala Laddu Controversy
తిరుమల లడ్డూల తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న విషయం తెలిసినప్పటి కడుపు రగిలిపోతోందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కల్తీపై ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అమరావతిలో ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు.
రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను జగన్ మార్చారని ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు . దివంగ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఏడు కొండలను 2కొండలు అంటేనే ఎంతో పోరాటం చేశామని చెప్పారు. తనకు వ్యక్తిగతంగానూ తిరుమల శ్రీవారంటే చిన్నప్పటి నుంచీ ఎంతో నమ్మకమని సీఎం చంద్రబాబు తెలిపారు.
గత జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కోవ్వు వాడినట్లు నిర్థారణ కావడంతో.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్, గత టీటీడీ చైర్మన్తోపాటు పాలక మండలి సభ్యులపై హైదరాబాద్లోని సైదాబాద్ పోలీస్ స్టేషన్లో హైకోర్టు న్యాయవాది ఫిర్యాదు చేశారు.
తిరుమల లడ్డూ విషయంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని లేఖలో జగన్ పేర్కొన్నారు. శ్రీవారి లడ్డూ అంశాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని జగన్ పేర్కొన్నారు. ఏదైనా పొరపాటు జరిగిఉంటే విచారణ చేయించి ..
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగినట్టు నిర్ధారణ అయిన నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘ప్రాయశ్చిత్త దీక్ష’ చేపట్టారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ అయ్యినట్టు నిర్ధారణ కావడంతో స్వామివారి భక్తులు, హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
దేవ దేవుడి మేల్కొలుపు సేవ నుంచి పవళింపు సేవ వరకు.. ఆగమ శాస్త్రాల నుంచి సనాతన ధర్మం వరకు.. లడ్డూ పోటు నుంచి వెంగమాంబ సత్రంలో జరిగే నిత్యాన్నదానం వరకూ తనతో జగన్ సొంత టీవీలో డిబేట్కు సిద్ధమా అని వల్లూరు జయప్రకాశ్ నారాయణ సవాల్ చేశారు. సనాతన ధర్మం గురించి మాట్లాడి గెలవలగలరా అని నిలదీశారు.
శ్రీవారి భక్తులు పవిత్ర ప్రసాదంగా భావించే లడ్డూను అపవిత్రం చేశారంటూ తిరుపతిలో శనివారం ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు ఆందోళనలు చేపట్టారు.హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినదించారు.
ఏడుకొండలవాడు కొలువైన క్షేత్రం తిరుమలలో ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలో అపవిత్ర పదార్థాలు వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.