Home » Tirumala Laddu Controversy
Andhrapradesh: వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుపతి ప్రతిష్ఠ దిగజారిందని కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. గతంలో దేవలయాలపై దాడులు జరిగితే ఒక్కరిపైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రామ తీర్ధంలో రాముడి తల తీశారని.. అంతర్వేదిలో రథం దగ్దం చేశారన్నారు. కొవ్వు పదార్ధాలు కలిసిన నెయ్యిని దిగుమతి చేసుకున్నారన్నది వాస్తవమని స్పష్టం చేశారు.
జగన్ వ్యాఖ్యల తర్వాత వైసీపీ శ్రేణులు అయోమయంలో పడ్డారనే చర్చ జరుగుతోంది. అసలు తమ పార్టీ అధ్యక్షులు ఏం మాట్లాడారో తమకే అర్థం కాలేదని, ఇప్పటికే లడ్డూ వివాదంతో శ్రీవారి భక్తుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తమకు జగన్ వ్యాఖ్యలు..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తికమకలో పడ్డారు. మకతికగా మాట్లాడారు. ఏం చెప్పాలనుకున్నారో తెలియదుకానీ... ఏదేదో చెప్పేశారు. ‘
: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవస్థానాల్లోనూ అలజడి మొదలైంది.
తిరుమల ఘటన తరువాత ఆలయాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని ఆలయాల్లో ప్రొటోకాల్పై శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తిరుమల లడ్డూ (Tirumal Laddu) వివాదంపై సుప్రీంకోర్టులో పిల్స్ దాఖలయ్యాయి. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Former Chairman YV Subbareddy), సుబ్రహణ్యస్వామి వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ చేయాలని సుబ్రహ్మణ్యస్వామి విజ్ఞప్తి చేశారు.
తిరుమలకు తాను వెళ్తానంటే బీజేపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఖండించారు. వైసీపీ అధినేతను బీజేపీ నేతలు ఎవ్వరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆయన అన్నారు.
ఏపీలో 13 జిల్లాల్లో వైసీపీ నేతలకు నచ్చిన వారికి ఇసుక రీచ్లు కట్టబెట్టి దోపిడీ చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని అన్నారు. బీజేపీ ప్రజల పక్షాన నిలబడుతుందని.. వారి కోసం కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి నేతలు కలిసి నడవాలని దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు.
తిరుమల పర్యటన రద్దు చేసుకున్న అనంతరం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు.
తిరుమల లడ్డూ వివాదంలో జగన్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ శ్రీవారి భక్తులు విమర్శిస్తున్నారు. గత ఐదేళ్లుగా సీఎం హోదాలో జగన్ తిరుమల ప్రతిష్టను దిగజార్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తుల నిరసనల మధ్య జగన్ తిరుమల పర్యటన షెడ్యూల్ను..