Home » tihar jail
లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చక్కటి ఆరోగ్యంతో ఉన్నట్టు జైలు వర్గాలు బుధవారంనాడు తెలిపాయి. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందన్న వార్తలను అధికారులు తోసిపుచ్చారు.
లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ ఆద్మీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యారు. ఆరు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన ఆయనకు ఆప్ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ బరువు తగ్గిపోయారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆరోపణలను జైలు అధికారులు తోసిపుచ్చారు. కేజ్రీవాల్ బరువు యధాతథంగా 65 కిలోలు ఉందని తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం(delhi liquor scam)కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) అనారోగ్యంతో ఉన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వర్గాలు తెలిపాయి. దీంతో మార్చి 21 అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 4.5 కిలోలు తగ్గారని అన్నారు.
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అక్కడ జపం చేసుకోవాలనుకుంటున్నారు. ఇందుకుగాను తనకు జపమాల కావాలని రౌస్
తీహార్ జైలులో చదువుకునేందుకు తనకు మూడు పుస్తకాలు కావాలని అరవింద్ కేజ్రీవాల్ కోరారు. రామాయణం, భగవద్గీతతో పాటు 'హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్' పుస్తకాన్ని అందుబాటులో ఉంచాలని రౌస్ అవెన్యూ కోర్టుకు కేజ్రీవాల్ విన్నవించారు.
లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయి తీహార్ జైలుకు వెళ్లిన ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ కేసులో మార్చి 21న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేయగా, అప్పట్నించి ఆయన ఈడీ కస్టడీలోనే ఉన్నారు. తాజాగా ఆయన కస్టడీని ఏప్రిల్ 15వ తేదీ వరకూ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించడంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు.
ఆర్థిక నేరారోపణల కింద తీహార్ జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ ఎప్పటికప్పుుడు లేఖలు విడుదల చేస్తూ.. పలు సంచలనాలకు కేరాఫ్గా మారాడు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత, ఆప్ నేతలు కేజ్రీవాల్, సత్యేంద్రజైన్, సిసోడియాపై సంచలన ఆరోపణలు చేస్తూ సుఖేష్ ఇప్పటికే పలు లేఖలు విడుదల చేశాడు. తాజాగా కవిత అరెస్ట్కు తీహార్ జైలు స్వాగతం పలుకుతుందంటూ లేఖ రాసిన సుఖేష్.. అరవింద్ కేజ్రీవాల్ను వదిలిపెట్టలేదు.
దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో మరోసారి విచారణ ఖైదీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు గ్రూపుల మధ్య జరిగిన ఈ దాడిలో ఇద్దరు గాయపడినట్టు జైలు అధికారులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 12.40 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.
Letter In Jail: జైలులోని ఖైదీలు(Prisoners) కూడా లేఖలు రాయవచ్చు. ఖైదీలు తమకు వచ్చిన లేఖలను, వారు వారి కుటుంబ సభ్యులకు రాసిన లేఖలను(letters) గురించి అప్పుడప్పుడూ వింటూవుంటాం.