Home » Thummala Nageswara Rao
చేనేత రంగానికి తమ ప్రభుత్వం రూ.490 కోట్ల బకాయిలు చెల్లించినట్లు చేనేత, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
వచ్చే నెలలో రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని, గతంలో మాదిరిగా రైతులకు అన్ని రకాల పనిముట్లు రాయితీపై అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వ ఆర్థిక దోపిడీ కారణంగా సంక్షేమ పథకాలు అమలుకు కాస్త ఆలస్యమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకి మిత్తి కట్టడానికే తెలంగాణ ఆర్థిక వనరులు సరిపోవటం లేదని అన్నారు. తప్పని సరిగా ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ఈ ఏడాది రైతులకు మరింత లబ్ధి చేకూర్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అన్నదాతలకు యంత్రపరికరాలు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందించాలని స్పష్టం చేశారు. రైతన్నలకు చేయూత నిచ్చి పంటల దిగుబడి పెంచే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకున్నా రైతాంగానికి చేసిన విధంగానే నేతన్నలను ఆదుకునేందుకు సీఎం రేవంత్రెడ్డి రూ.874 కోట్ల పాత బకాయిలను విడుదల చేసినట్టు చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఖమ్మం చరిత్ర తెలిపేలా ఖిల్లాపై రోప్వే ఏర్పాటుతో పర్యాటక అభివృద్ధి చెందుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పెరుగుతున్న అర్బన్ పాపులేషన్కు తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. ఖమ్మం నగరం పరిశుభ్రంగా విశాలమైన రహదారులు పచ్చదనంతో ఇతర నగరాలకు ఆదర్శంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని, రైతు బిడ్డగా తనకు ఎంతో సంతృప్తిగా ఉందని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రైతులకు ఇంకా చేయాల్సింది చాలా ఉందని, ఆ దిశగా రేవంత్రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
కేసీఆర్ హయాంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు. ఇంటిగ్రేటెడ్ పాఠాశాలలతో అన్నికూలల అభివృద్ధికి పునాదులు పడుతున్నాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు.
ఆయిల్ పామ్ సాగుతో రైతన్నను రాజుగా మార్చడమే తన కలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులు నష్టాల బారిన పడకుండా లాభాలు తెచ్చిపెట్టే పంట ఆయిల్ పామ్ అని తుమ్మల చెప్పారు.
మహబూబ్నగర్ జిల్లాలో నిర్వహించిన మూడ్రోజుల రైతు పండుగ విజయవంతం కావడం పట్ల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అభినందించారు.