Home » Thummala Nageswara Rao
కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రైతుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో కూడా దోచుకుందని విమర్శించారు.
ప్రపంచానికి తెలుగుజాతి కీర్తిని చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని, ఆయన ద్వారానే తెలుగుజాతికి గుర్తింపు వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
ఖమ్మం జిల్లాలో సీతారామ భక్తరామ దాసు ప్రాజెక్ట్లతో సస్య శ్యామలం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో కమ్మ వారు అమెరికాలో రాణిస్తున్నారని తెలిపారు. తోటి కులాలను గౌరవిస్తూ లౌకిక భావనతో కమ్మ కులం ఆదర్శంగా నిలిచిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
మిద్దె తోటలు పెచండంలో ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందని.. మహిళలు ముందుకు రావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కల్తీ ఆహారం పురుగు మందుల అవశేషాలున్న కూరగాయలు తిని మనిషి కష్టార్జితం అంతా హాస్పిటల్ పాలవుతుందని చెప్పారు.
పత్తి కొనుగోళ్లలో ఈ సంవత్సరం దేశంలోనే తెలంగాణ నెం.1 స్థానంలో కొనసాగుతోందని, రైతులకు ఇబ్బంది కలగకుండా గత ఏడాది కంటే ఎక్కువగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
వరి కొయ్యలను తగలబెట్టొద్దని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. అలా తగలబెడితే కలిగే అనర్థాలపై ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో రెండో స్థానం కోసం బీఆర్ఎస్, బీజేపీ పోటీపడుతూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రి తుమ్మల పుట్టినరోజు సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సచివాలయంలో శుక్రవారం ఆయన్ను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మళ్లీ అధికారం కోసం రైతుల ఆత్మ స్థైర్యం దెబ్బ తీసే ప్రయత్నం చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తోందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. గతేడాది అక్టోబరులో ప్రధాని మోదీ జాతీయ పసుపు బోర్డును ప్రకటించారని, ఆ హామీని నెరవేర్చాలన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పునకు తమ ప్రభుత్వం నెలకు రూ.6 వేల కోట్లు వడ్డీ కడుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు.