Home » Thanneeru Harish Rao
ప్రజలు కష్టాల్లో ఉన్నారు సహాయక చర్యల కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు అన్నారు. ఇంట్లో వరద నీరు, కంట్లో ఎడతెగని కన్నీరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు సంచలన విమర్శలు గుప్పించారు. మంత్రి ఉత్తమ్కి హరీష్రావు కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ను డెకాయిట్ అని ఉత్తమ్ సంభోదించడం ఆయన దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైడ్రా పేరుతో తెలంగాణలో హైడ్రామా నడుస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పాలనను పక్కదారి పట్టించే పాలన నడుస్తోందని ఆరోపణలు చేశారు. విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారని హరీష్రావు ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు లేఖ రాశారు. వ్యవసాయంలో దన్నుగా నిలుస్తూ, పాడిసంపదతో అదనపు ఆదాయాన్ని సమకూర్చే మూగజీవాల సంరక్షణపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం శోచనీయమని మండిపడ్డారు.
పోలీస్ యాక్ట్తో లాఠీలతో రైతు ధర్నాలు ఆపలేరని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు అన్నారు. ప్రజా పాలనలో ధర్నాలు నిషేధం అని రైతులకు పోలీసులు నోటీసులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. రైతులు అందరికీ ఆగస్టు 15వ తేదీ లోపు రుణమాఫీ చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి మాట తప్పారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
రైతు రుణమాఫీ గురించి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఎక్కడికి వస్తారో రండి.. చర్చ పెడదామని జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి అన్నారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు చేసింది ఏంటని ప్రశ్నించారు. ఎనిమిది నెలల్లో రేవంత్ ప్రభుత్వం రైతులకు చేసింది ఏంటో డేటా తీసుకువస్తామని సవాల్ విసిరారు.
రుణమాఫీ కాలేదన్న రైతులను అరెస్టులు చేస్తారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు ప్రశ్నించారు. ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామిక విధానాలను రేవంత్ ప్రభుత్వం అనుసరించడం సిగ్గుచేటని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఎగవేత... కోతల ప్రభుత్వమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు ఆరోపించారు. తన నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చిన ఎల్లప్పుడూ వారి సేవలోనే ఉంటానని తెలిపారు. పెన్షన్లు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు బంగారం మాటలకే పరిమితమైందని హరీష్రావు విమర్శించారు,
నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ఆదివారం నాడు అన్నం వడ్డించారు. అయితే ఈ సమయంలో కారం పొడితో భోజనం పెట్టినట్లు ప్రచారం జరిగింది. పాఠశాలలో జరిగిన ఘటన వివాదాన్ని రేపింది.