Home » Thanneeru Harish Rao
డిటోనేటర్లు పెట్టి మల్కాపూర్ చెరువులో కట్టడాలను కూల్చివేసిన అధికారులు, ఇప్పుడు హైడ్రాకి, హోంగార్డు గోపాల్ చనిపోవడానికి ఎలాంటి సంబంధం లేదని చేతులు దులుపుకోవడం సిగ్గుమాలిన చర్య అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు ధ్వజమెత్తారు. ఈ సంఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. హోంగార్డు గోపాల్ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని హరీష్రావు డిమాండ్ చేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు తెలంగాణను అతలాకుతలం చేశాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. లనీలు పూర్తిగా వరద నీటితో నిండిపోగా, జనజీవనం స్తంభించిపోయిందని తెలిపారు. ఎంతో మంది నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారని చెప్పారు
100 రోజుల్లో రేవంత్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను పూర్తిగా ఎందుకు అమలు చేయలేదని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు ప్రశ్నించారు. డిసెంబర్ 9న రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని మోసం చేశారని హరీష్రావు అన్నారు. కేసీఆర్ సీఎం కాగానే మొదటి నెలలోనే రూ 2 వేల పింఛన్ ఇచ్చారని హరీష్రావు గుర్తుచేశారు.
తెలంగాణలో పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. 38నెలలు టీపీసీసీ అధ్యక్షుడిగా పార్టీని ముందుకు తీసiకెళ్లానని తెలిపారు. ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా పూరించి వెనక్కి తిరిగి చూడలేదని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్రీజ పాల ఉత్పత్తి కేంద్రం హరీష్రావు బినామీ అని.. ఆ పేరుతో ఆయన చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలోని ప్రైవేట్ ఉపాధ్యాయుల గురించి తక్కువ చేసి మాట్లాడటం తగదని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. సిద్దిపేటలోని పోలీస్ కన్వేషన్ హల్లో జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో ఈరోజు (శనివారం) గురుపూజోత్సవం, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార మహోత్సవం జరిగింది.
పీఏసీ చైర్మన్గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని అసెంబ్లీ స్పీకర్ నియమించారు. అయితే ఈ విషయంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. హరీష్రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లు హరీష్ రావు వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శలు చేశారు.
పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి హరీష్రావు సుద్దపూస కబుర్లు చెబుతున్నారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపణలు చేశారు. తెలంగాణలో పదేళ్ల పాటు ప్రజాస్వామ్యాన్ని చెరపట్టి ఇప్పుడు నీతులు బోధిస్తున్నారని విమర్శించారు.
వరదపైన బీఆర్ఎస్ పార్టీ బురద రాజకీయాలు చేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపణలు చేశారు. ఈరోజు(గురువారం) హైదరాబాద్లోని సీఎల్పీ మీడియా హాల్లో ఆది శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు.
విద్యావ్యవస్థ ఇంకా బలోపేతం కావాలని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు( Harish Rao) అన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీసీ భవనంలో గురుపూజోత్సవం సందర్బంగా ఈరోజు(గురువారం) జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో హరీష్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.