Home » TGSRTC
తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటే జనాలు జడుసుకుంటున్నారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమనే భావన ఉన్నప్పటికీ.. ఇబ్బంది పడుతూ వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రయాణికులకు సరిపడినన్ని బస్సులు నడపడం లేదనే ఆరోపణలు అధికమవుతున్నాయి.
రోడ్డు రవాణా సంస్థలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడం శుభపరిణామమని గచ్చిబౌలి డిపో మేనేజర్ మురళీధర్రెడ్డి అన్నారు. గచ్చిబౌలి బస్డిపోలో(Gachibowli Bus Depot) మొత్తం 69 విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టారు. మూడు దఫాలుగా ఈ బస్సులు నడపనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
సిటీ బస్సుల్లో(City buses) రోజూ 19 లక్షల మంది ప్రయాణిస్తుండగా, వీరిలో 9 నుంచి 10 లక్షల మంది మహిళలే ఉంటున్నారు. రద్దీ ఎక్కువై ఆర్డినరీ బస్సులపై లోడ్ పెరుగుతోంది. దీంతో టైర్లు, ఇంజన్లపై ఒత్తిడి పెరుగుతుందని మెకానిక్లు చెబుతున్నారు.
పర్యావరణానికి మేలు చేయడంతోపాటు నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునేందుకు ఆర్టీసీ గ్రేటర్(RTC Greater) పరిధిలో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను తెచ్చేందుకు సన్నద్ధమవుతోంది.
TGSRTC: పండుగ వేళ ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం. దసరా వేళ స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లు పెట్టేందుకు సిద్ధమైంది. దసరా రద్దీ దృష్ట్యా స్పెషల్ బస్సులు నడుపుతున్నామని ప్రకటించిన ఆర్టీసీ.. ఆ బస్సుల్లో ప్రత్యేక ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేసింది.
సద్దుల బతుకమ్మ, దసరాకు 6,304 ప్రత్యేక బస్సులను జిల్లాలకు నడుపుతున్నామని, స్పెషల్ ఆపరేషన్స్కు పోలీస్, రవాణా శాఖల అధికారులు సహకరించాలని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(TGS RTC MD VC Sajjanar) కోరారు.
త్వరలో టీజీఎస్ ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలంగాణ రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సంస్థలో మిగిలిన ఖాళీలను సైతం భర్తీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజా అవసరాలకు అనుగుణంగా నూతన ఆర్టీసీ బస్సుల కొనుగోలుకు రంగం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు.
ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్(Congress) విస్మరించిందని ఆర్టీసీ జేఏసీ(RTC JAC) నేతలు విమర్శించారు.
సోమవారం ఉదయం గద్వాల్ డిపోకు చెందిన గద్వాల్ - వనపర్తి రూట్లో పల్లె వెలుగు బస్సులో నిండు గర్బిణీ సంధ్య.. రక్ష బంధన్ సందర్భంగా సోదరులతో రాఖీ కట్టించుకునేందుకు వనపర్తికి బయలుదేరింది. బస్సు నాచుపల్లి సమీపంలోకి రాగానే ఆమెకు నొప్పులు తీవ్రమయ్యాయి. బస్సు కండక్టర్ జి. భారతీ వెంటనే స్పందించారు. బస్సును పక్కకు ఆపి.. మిగిలిన ప్రయాణికులకు దింపేశారు అదే బస్సులో ప్రయాణిస్తున్న నర్సు సహాయంతో సంధ్యకు పురుడు పోశారు.