Home » TG Politics
బీజేపీలో పాత కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. ఆర్థికంగా బలంగా లేని కార్యకర్తలను ఎన్నికల్లో నిలబెట్టి వారి విజయం కోసం పార్టీ పెట్టుబడి పెట్టాలని ఆకాంక్షించారు.
కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తోందని జేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. పావలా వడ్డీకి కేంద్రం నిధులు ఇస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్లకు అభివృద్ధి పనులు చేయడానికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణ బీజేపీ నేతల కొట్లాటల పంచాయితీ ఢిల్లీకి చేరింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శల వ్యవహారపై బీజేపీ హై జాతీయ కమాండ్ సీరియస్ అయిందని సమాచారం.
ఇండస్ట్రీయల్ పాలసీపై కేటీఆర్ వ్యాఖ్యలు అడ్డగోలుగా ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలని ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. కన్వర్షన్కు... భూమికి లింక్ పెట్టి రాజకీయం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేటీఆర్ అండ్ కో తెలంగాణకు మంచి చేయరని... తాము చేస్తుంటే అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కేటీఆర్ వ్యాపారవేత్తలను బెదిరించారని ఆరోపించారు.
వ్యవసాయ మంత్రికి రైతన్నలపై ప్రేమ ఉంటే నిన్న(సోమవారం) జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో స్పష్టమైన హామీ ఎందుకు ఇవ్వలేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. దమ్ముంటే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 20వేలు ప్రకటించాలని సవాల్ చేశారు కేటీఆర్.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ దక్కలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ నాలుగు ముక్కలైందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలను విమర్శించేందుకు కూడా తమకు నోరు రావట్లేదని దెప్పిపొడిచారు.
జాగృతి జనం బాటలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులని దీర్ఘకాలం ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు.
కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేశారంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. జై తెలంగాణ అంటూ కవిత సమాధానమిచ్చారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో ప్రజలు చెప్పిన వాటి ఆధారంగానే తాను ఆరోపణలు చేసినట్లు చెప్పుకొచ్చారు.
మొక్కజొన్న కొనుగోళ్లలో రేవంత్రెడ్డి ప్రభుత్వం వేగం పెంచాలని మాజీ మంత్రి హరీశ్రావు కోరారు. మొక్కజొన్న రైతులను పట్టించుకోవడం లేదని, కొన్నవారికి కూడా డబ్బులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం గ్రేడ్ల పేరిట పత్తి రైతులను అరిగోస పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.