Home » TG Politics
మహిళలతో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడరని మంత్రి సీతక్క హెచ్చరించారు. సొంత ఇంటి ఆడబిడ్డను గోస పెడుతున్నారని.. మాజీ మంత్రి కేటీఆర్కు ఇది తగునా? అని ప్రశ్నించారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్లు శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు.
కార్ల విషయంలో తాను తప్పు చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్లో మాగంటి సునీత మంచి మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రజల ఆశీర్వాదం కేసీఆర్కు ఉందని కేటీఆర్ ఉద్ఘాటించారు.
కేసీఆర్ చేసిన అభివృద్ధే తనను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిపిస్తుందని మాగంటి సునీత ధీమా వ్యక్తం చేశారు. తాను ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తోందని ఎప్పుడూ అనుకోలేదని మాగంటి సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడ, బెంగుళూరు, నాగపూర్, బాంబే వంటి అన్ని రాష్ట్రాలకు అద్భుతంగా జాతీయ రహదారులు ఏర్పాటు చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల ఏర్పాటు ద్వారా వెనుకబడిన గ్రామాలు అభివృధి చెందుతున్నాయని తెలిపారు.
దసరా సెలవుల్లో కూడా ఉద్యోగులతో రేవంత్రెడ్డి ప్రభుత్వం పని చేయిస్తోందని.. ఈ ఆలోచనను విరమించుకోవాలని బీజేపీ మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు కోరారు. ఉద్యోగులను దసరా సెలవుల్లో కూడా పని చేయించడం సరికాదని చెప్పుకొచ్చారు.
ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గాంధీ భవన్లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం చాలా బాగా జరుగుతోందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
కామారెడ్డిలో వరద నష్టం అంచనాపై రీ సర్వే చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అర్వింద్ సూచించారు. కామారెడ్డిలో వరద నష్టానికి ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ఎంపీ ధర్మపూరి అర్వింద్ ప్రశ్నించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై మోదీ ప్రభుత్వానిది మెతక వైఖరి అని మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ను కాళేశ్వరం కేసు నుంచి తప్పించే అవకాశం ఉందని విమర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటనపై టీ బీజేపీ చీఫ్ రామచందర్ రావు సెటైర్లు గుప్పించారు. 50 సార్లు ఢిల్లీ వెళ్లినందుకు రేవంత్రెడ్డికి ఆఫ్ సెంచరీ సెలబ్రేట్ చేయాలని ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డికి కిషన్రెడ్డి ఫోబియా పట్టుకుందని రామచందర్ రావు విమర్శించారు.