Home » Tesla
లగ్జరీ కార్ల గ్లోబల్ దిగ్గజం టెస్లా (Tesla) విస్తరణలో భాగంగా భారత్లోనూ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు పెట్టుబడుల ప్రతిపాదనపై భారత ప్రభుత్వంతో చర్చిస్తోంది. ఏడాదికి 5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి సామర్థ్యంతో ఫ్యాక్టరీ ఏర్పాటు చర్చిస్తున్నట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ రిపోర్ట్ పేర్కొంది.
అగ్రరాజ్యం అమెరికా (America) పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi US visit) టెస్లా సీఈవో, ట్విటర్ (Twitter) యజమాని ఎలాన్ మస్క్తో (Elon musk) భేటీ కాబోతున్నారు. భారత్లో కంపెనీ ఏర్పాటు కోసం టెస్లా అనువైన లోకేషన్ను అన్వేషిస్తున్న సమయంలో మస్క్ని మోదీ కలవనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.