Home » terrorist
సరిహద్దులో ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. భారత భద్రతా బలగాలే(BSF) టార్గెట్గా విరుచుకుపడుతున్నారు. సోమవారం ఉదయం జమ్మూకశ్మీర్లో(Jammu Kashmir) ఉగ్రవాదులు(Terrorists), భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఉగ్రవాదాన్ని పెంచిపోషించిన పాకిస్థాన్కి అదే ఉగ్రవాదం తలనొప్పిలా మారింది. తాజాగా అక్కడి సైన్యంపై తుపాకులతో దాడులకు దిగిన ఉగ్రవాదులను పాక్ సైన్యం టెర్రర్ ఆపరేషన్ నిర్వహించి మట్టుబెట్టింది. మే 26, 27 తేదీల్లో జరిగిన ఆపరేషన్లో.. 23 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్ కీలక అరెస్టులు చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాతో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్న నలుగురు ఉగ్రవాదులను అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రంలో సోమవారంనాడు అరెస్టు చేసింది
కశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో బుధవారం రాత్రి భద్రతా బలగాలు టెర్రరిస్టులకు(Terrorists) మధ్య భారీ ఎన్ కౌంటర్(Encounter) జరిగింది. ఈ ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు.
గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకేసులో కీలక నిందితుడు, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఉగ్రవాది గోల్డీ బ్రార్(30) అమెరికాలో హత్యకు గురయ్యాడు.
సరిహద్దు ఉగ్రవాదాన్ని మట్టుపెట్టేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. ఉగ్రవాదులకు ఎలాంటి నిబంధనలు ఉండవని, వారికి వారి భాషలోనే సమధానం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఉగ్రవాదాన్ని భారత్ ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు.
కేంద్రంలో శక్తిమంతమైన బీజేపీ ప్రభుత్వం ఉందని.. అందుకే మన సైనిక బలగాలు ఉగ్రవాదులను వారి నేలపైనే మట్టుబెడుతున్నాయని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. వారి ఇళ్లలోకి చొచ్చుకెళ్లి మరీ చంపుతున్నాయని చెప్పారు.
దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి సరిహద్దుల మీదుగా పారిపోయేందుకు ప్రయత్నించే ఏ ఒక్కరినీ విడిచిపెట్టమని, వారిని పాక్గడ్డపైకి అడుగుపెట్టయినా సరే మట్టుబెడతామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారంనాడు గట్టి హెచ్చరిక చేశారు.
ఐఐటీలో(IIT) చదువుతున్న ఓ విద్యార్థి ఐసిస్ ఉగ్రవాద గ్రూపులో చేరి దేశ వ్యాప్తంగా భారీ విధ్వంసానికి కుట్ర పన్నాడనే విషయం సంచలనం సృష్టిస్తోంది. ఎట్టకేలకు అతన్ని పట్టుకుని పోలీసులు విచారిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: చర్ల మండలంలో మావోయిస్టు బ్యానర్లు, కరపత్రాలు వెలిసాయి. మావోయిస్టు అనుబంధ ఆదివాసీ విప్లవ మహిళా సంఘం, విప్లవ మహిళా సంఘం పేరుతో పోస్టర్లు, కరపత్రాలు వెలసాయి. మార్చి 8 వ తేదీన 114 వ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం జరుపుకోవాలని బ్యానర్లు, కరపత్రాలద్వారా పిలుపిచ్చారు.