Home » Tenth Exams
10th class exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరుగనున్నాయి.
AP SSC Hall Tickets: పదోతరగతి విద్యార్థులు హాల్ టికెట్లపై కీలక అప్ డేట్ వచ్చేసింది. విడుదలైన తర్వాత అధికారిక వెబ్సైట్(bse.ap.gov.in)ను సందర్శించి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
ప్రణాళికాతో చదివితే విజయం సాధించవచ్చని టీటీడీ ఏఏవో బాలగోవింద్ విద్యార్థులకు సూచించారు.
తెలంగాణలో పది పరీక్షలు రాసి ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త!. మంగళవారం (ఏప్రిల్-30న) నాడు ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఉదయం 11. 00 గంటలకు పదో తరగతి ఫలితాలు (TS 10th Class Results 2024 ) విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు. ఈ ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు..
TS 10th Class Results 2024: తెలంగాణలో పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ 30వ తేదీ అంటే.. రేపు ఉదయం 11.00 గంటలకు విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పలితాలను ఆంధ్రజ్యోతి. కామ్ వెబ్సైట్లో క్లిక్ చేసి విద్యార్థులు.. తమ హాట్ టికెట్ ఎంటర్ చేసి.. వచ్చిన మార్కులను తెలుసుకోవచ్చు. ఈ ఏడాది మార్చి 18వ తేదీన 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైనాయి. ఏప్రిల్ 2వ తేదీతో ఈ పరీక్షలు ముగిశాయి.
పదో తరగతి పరీక్షల ఫలితాలు కొద్ది సేపటి క్రితం విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్ https:// results. bse.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది 7లక్షల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాశారు.
ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఎగ్జామ్స్ ( Education ) రాసేసిన స్టూడెంట్స్ ఎప్పుడెప్పుడు రిజల్ట్స్ ఇస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారికి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ నెలాఖరుకు పదో తరగతి ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.
నిర్మల్ జిల్లా: చిన్నప్పుడే పోలియో కారణంగా దివ్యాంగుడైన తన కొడుకును ఎలాగైనా విద్యావంతుడిగా చూడాలని ఆ తల్లి కలలు కంది. అందుకోసం చిన్నప్పటి నుంచి కొడుకును తన చేతుల మీదుగా తీసుకువెళ్లి చదివించింది. ఇప్పుడు తన కొడుకు పదో తరగతి పరీక్షలు రాస్తుండడంతో ఆ తల్లి ప్రతిరోజూ తన కొడుకును ఎత్తుకుని పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్ళి పరీక్ష రాయిస్తుంది.
గుండెపోట్లు విద్యార్థులను సైతం వెంటాడుతున్నాయి. పరీక్షల సమయం కావడంతో తీవ్రమైన ఒత్తిడి కారణంగానో లేదంటే నిద్రలేమి కారణమో తెలియదు కానీ పదో తరగతి విద్యార్థిని పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన కడప జిల్లా రాజుపాలెం మండలం కొర్ర పాడు గ్రామంలో జరిగింది.
Andhrapradesh: ఏపీలో పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు పరీక్ష జరుగనుంది. నేటి నుంచి ఈనెల 30వరకు పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం 7,25,620 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. వారిలో రెగ్యులర్ విద్యార్థులు 6,23,092 మంది, రీఎన్రోల్ అయినవారు 1,02,528 మంది ఉన్నారు.