Home » Telugu Desam Party
ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అన్నింటినీ అమలు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పేదరికాన్ని పారద్రోలేలా మార్గదర్శకుల సహకారంతో పీ4ను అమలు చేస్తున్నామని వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీ వ్యాప్తంగా విద్యుత్ శాఖలో 180 మందికి కారుణ్య నియామకాలు చేశామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు. ఏపీలో విద్యుత్ కనెక్షన్ లేని గృహం ఉండకూడదని సీఎం చంద్రబాబు తనను ఆదేశించారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.
తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకొని లక్షకోట్లు కొల్లగొట్టి 16 నెలలు చంచలగూడ జైల్లో చిప్పకూడు తిన్న నేర చరిత్ర జగన్ది అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. ఆర్థిక నేరస్తుడిగా ముద్రపడిన జగన్కు 16 నెలలుగా బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరించిందని గుర్తుచేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కావాలనే విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. జగన్ వాహనం కింద ఓ వ్యక్తి పడిన ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. దయ, జాలి లేకుండా అతడ్ని ముళ్ల పొదల్లో పడేశారని హోంమంత్రి అనిత ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ నేతలపై గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ (శుక్రవారం) గుత్తిలో టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
జగన్ అబద్దపు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు చెప్పారు. అరాచక ర్యాలీ, పైశాచిక ప్రవర్తనతో ఇద్దరు చనిపోయారని.. వారిని ఎందుకు జగన్ రెడ్డి పరామర్శించ లేదని దేవినేని ఉమామహేశ్వర రావు ప్రశ్నించారు.
జగన్ తన హయాంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని నడిపారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మండిపడ్డారు. మహిళలు ఓట్లు వేయలేదని, ప్రజలు తనకు ప్రతిపక్ష హోదా కల్పించలేదనే అక్కసుతోనే జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఆపరేషన్ సిందూర్ని ప్రారంభించి టెర్రరిజం అణచివేతకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలో గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్, యునైటెడ్ దేశాలను సందర్శించారు.
విశాఖను టూరిజం హబ్గా, ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పాఠశాలలు తెరిచే లోపు...తల్లికి వందనం ఇస్తామని చెప్పామని అలాగే మాట నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
ఇళ్ల స్థలాల పేరుతో భూములు కొని మాజీ మంత్రి పేర్ని నాని కమీషన్లకు పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రెస్మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న పేర్ని నానిని చూసి రాష్ట్ర ప్రజలంతా ఒక బఫూన్లా చూస్తున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు.