Home » Telugu Desam Party
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ తన వ్యక్తిగత మొక్కును తీర్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయన తన స్వగ్రామమైన షాద్నగర్ నుంచి తిరుమల వరకు మహా పాదయాత్ర చేపట్టనున్నారు. వివరాల్లోకి వెళితే..
చరిత్రలో అత్యంత హీనమైన ఓటమి జగన్దేనని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఎద్దేవా చేశారు. వైసీపీ చరిత్ర అయిపోయిందని విమర్శించారు. మరో 25ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
జగన్ హయాంలో దళితులపై దాడులు చేశారని ఏపీ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. ఈ ఘటనలు ప్రజలకు ఇంకా గుర్తున్నాయని చెప్పుకొచ్చారు. వెలిగొండకు డబ్బులు ఇవ్వలేదని వైసీపీ నేతలు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో ఎలాంటి పనులు చేయకుండానే రూ.కోట్లు తినేశారని తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో చేసిన పనులను కాకాణి వెంటనే నిరూపించాలని బహిరంగంగా తాను సవాల్ విసిరితే తన మీద ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
నంద్యాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ముఖ్య అనుచరుడు, వైసీపీ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్చార్జిగా పనిచేసిన పీవీ ప్రదీప్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ ఏడాది ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలవబోతోందని వ్యాఖ్యానించారు.
వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గంపలగూడెం మండలంలో వైసీపీకి చెందిన కీలక నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ చేరికలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
వైసీపీకి మరో గట్టి షాక్ తగిలింది. జగన్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో భారీగా చేరారు. సుమారుగా 200 కుటుంబాలు ఫ్యాన్ పార్టీని వదలి పసుపు కండువా కప్పుకున్నాయి.
కేబీయన్ కళాశాలకు ఒక చరిత్ర ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఎంతోమంది ఇక్కడ చదువుకుని దేశ విదేశాల్లో రాణిస్తున్నారని చెప్పుకొచ్చారు.
వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ప్రకాశం జిల్లాలోని వెలిగండ్ల మండల స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.