Home » Telugu Desam Party
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో తెలుగుదేశం ఎంపీలు సోమవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఏపీ అభివృద్ధికి మరింత సహకారం అందించాలని టీడీపీ ఎంపీలు విజ్ణప్తి చేశారు. ఆపరేషన్ సిందూర్ విజయం పట్ల ప్రధానికి ఎంపీలు అభినందనలు తెలిపారు.
మ్మడి కడప జిల్లాలోని రెండుచోట్ల జరిగే జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఆదివారం సాయంత్రానికి ప్రచార సమయం ముగియడంతో అంతా గప్చుప్గా మారింది. పులివెందుల నుంచి టీడీపీ జడ్పీటీసీ సభ్యురాలిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి హేమంత్రెడ్డి బరిలో ఉన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలందరూ జగన్కి జ్ఞానోదయం చేయాలని హితవు పలికారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. అంతకు ముందు పాడేరు మండలం వంజంగిలో వనదేవత మోదకొండమ్మను దర్శించుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడమని కోరుకున్నట్లు పేర్కొన్నారు.
పులివెందులల్లో సాక్షి మీడియాను అడ్డుపెట్టుకొని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని తెలుగుదేశం పులివెందుల ఇన్చార్జ్ బీటెక్ రవి ఆరోపించారు. ఏపీ నలుమూలల నుంచి పులివెందులకు సాక్షి రిపోర్టర్లు వచ్చారని చెప్పుకొచ్చారు. వాళ్లకు వాళ్లే దాడి చేసుకొని తమపై నింద వేయడానికి ప్లాన్ చేస్తున్నారని బీటెక్ రవి ధ్వజమెత్తారు.
సార్వత్రిక ఎన్నికల తర్వాత జిల్లాలో జరుగుతున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. రెండు చోట్ల, టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి.
వైసీపీ నేతలు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డిలపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. అవినాష్, సతీష్లు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అనుమతి లేకుండా అధిక సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారని ఎంపీడీవోకు కొంతమంది ఫిర్యాదు చేశారు.
కడప జిల్లాలో ఈ నెల 12న జరగనున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. పులివెందుల నుంచి 11 మంది పోటీ చేస్తుండగా ఒంటిమిట్ట నుంచి కూడా 11 మందే బరిలో ఉన్నారు. పులివెందుల టీడీపీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నుంచి తుమ్మల హేమంత్రెడ్డి, కాంగ్రెస్ నుంచి మొయిళ్ల శివకళ్యాణ్ రెడ్డి పోటీలో ఉన్నారు.
పాలకొల్లుకు చెందిన వైసీపీ నాయకులు క్రికెట్ బెట్టింగ్లో దొరికినా, అక్రమ సంపాదనలు వెలుగు చూసినా అరాచకాలను సాక్షి దినపత్రిక ఎందుకు ప్రచురించడం లేదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నల వర్షం కురిపించారు. తాను బాధ్యతాయుతంగా పనిచేస్తుంటే సాక్షి దినపత్రికలో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ తన వ్యాఖ్యల ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథి ప్రశ్నల వర్షం కురిపించారు. రౌడీలు, గంజాయి స్మగ్లర్లు, బెట్టింగ్ రాయుళ్ల ఇళ్లకు జగన్ వెళ్లడం పరామర్శా? ఎలా అవుతోందని నిలదీశారు. ఇలాంటి పరామర్శలు వైసీపీ ఉనికిలో ఉందని చెప్పుకోవడానికే కదా అని మంత్రి కొలుసు పార్థసారథి ప్రశ్నించారు.