Home » Telangana Politics
మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన ప్రాజెక్టు ప్రజా వ్యతిరేకతకు గురి కాకముందే తాత్కాలికంగా పక్కన పెట్టాలని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సూచించారు.
మూసీ సుందరీకరణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఘరానా మోసానికి దిగారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) ఆరోపించారు.
బీఆర్ఎస్ హయాంలో రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా.. అది కళ్ల ముందే కూలిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జలసౌధలో ఏఈఈలకు ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమం, దుర్గాబాయి దేశ్ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ను ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి గురువారం పాల్గొన్నారు.
అధికారులు, పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలకకూడదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) పేర్కొన్నారు. అలా చేసిన వారికి ప్రస్తుతం ఏపీలో ఏం జరుగుతుందో చూస్తున్నారుగా అని అధికారులను హెచ్చరించారు.
పదేళ్లపాటు శాంతి భద్రతల సమస్య రాకుండా బీఆర్ఎస్ పాలన సాగిందని.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Harish Rao) అన్నారు.
సెటిలర్లను తమ నుంచి దూరం చేసేందుకు కాంగ్రెస్ కుట్రపన్నుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్ల కాలంలో ఏనాడు సెటిలర్లకు ఇబ్బందులు కలగలేదని గుర్తు చేశారు.
"నీ పేరు ఏంది.. నాలుగేళ్ల తరువాత మళ్లీ వస్తాం చూస్కుందాం" ఇది అన్నది ఎవరో చోటామోటా నేత కాదు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేనే. ఆయన ఎవరో కాదు తన్నీరు హరీశ్ రావు.
భాగ్యనగరం సాక్షిగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. ఈ క్రమంలో సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
శాసనసభకు సంబంధించి మూడు కమిటీలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) సోమవారం ప్రకటించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) చైర్మన్ గా అరికెపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్గా(అంచనాల కమిటీ) పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్గా శంకరయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సుప్రీం వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని ఆయన పేర్కొన్నారు.