• Home » Telangana Politics

Telangana Politics

Congress Praja Deevena Sabha: పాలమూరు వేదికగా కాంగ్రెస్ ప్రజాదీవెన సభ

Congress Praja Deevena Sabha: పాలమూరు వేదికగా కాంగ్రెస్ ప్రజాదీవెన సభ

Congress Praja Deevena Sabha: పాలమూరు గడ్డ మీద నుంచి పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). బుధవారం నాడు కాంగ్రెస్(Congress) ఆధ్వర్యంలో పాలమూరులో ప్రజాదీవెన సభ చేపట్టింది. ఈ సభా వేదికగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. కాగా, కాంగ్రస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జిల్లాలో..

Breaking: ఆర్ఎస్‌పీ ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌లో మరో వికెట్ ఔట్..!

Breaking: ఆర్ఎస్‌పీ ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌లో మరో వికెట్ ఔట్..!

Telangana Politics: తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్(BRS) పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు బీఆర్ఎస్‌ను వీడగా.. ఇప్పుడు మరో కీలక నేత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(Koneru Konappa) పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో కోనప్పపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) పోటీ చేశారు.

Telangana: రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Telangana: రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బుధవారం నాడు ‘రైతు నేస్తం’(Rythu Nestham) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka), వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) పాల్గొన్నారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్‌ అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమమే ‘రైతు నేస్తం’.

Komatireddy Venkatreddy: బీఆర్‌ఎస్‌లో హరీష్‌రావు ఉండడం డౌటే!

Komatireddy Venkatreddy: బీఆర్‌ఎస్‌లో హరీష్‌రావు ఉండడం డౌటే!

Telangana: కేసీఆర్ ప్రభుత్వానికి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత హరీష్‌రావు కూడా ఉండడం డౌటే అని ... బీజేపీలోకి పోతారంటూ సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నారని తెలుస్తోందన్నారు.

BRS - BSP: తెలంగాణలో కొత్త పొత్తు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు..

BRS - BSP: తెలంగాణలో కొత్త పొత్తు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు..

BRS - BSP Alliance: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో(Telangana) కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్(BRS), బీఎస్‌పీ(BSP) మధ్య పొత్తు ఖరారైంది. బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar).. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(KCR)తో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు నేతలు పొత్తు విషయమై జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ సందర్భంగా కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరూ మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నాయని కేసీఆర్ ప్రకటించారు.

TS News: మాజీ సీఎం కేసీఆర్‌తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ

TS News: మాజీ సీఎం కేసీఆర్‌తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ

పార్లమెంట్ ఎన్నికలకు ముహుర్తం దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మర్యాపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని నంది నగర్‌లో గల కేసీఆర్ నివాసంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు.

Kavitha: ఆ జీవోతో ఆడబిడ్డల నోట్లో మట్టి కొట్టారు... కాంగ్రెస్‌ సర్కార్‌పై కవిత ఫైర్

Kavitha: ఆ జీవోతో ఆడబిడ్డల నోట్లో మట్టి కొట్టారు... కాంగ్రెస్‌ సర్కార్‌పై కవిత ఫైర్

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం జీవో3 తో ఆడబిడ్డల నోట్లో మట్టి కొడుతుందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడతూ.. ఆ జీవోతో మహిళలు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయన్నారు. నిన్న ఇచ్చిన గురుకుల పోస్టుల్లో కేవలం 77 మాత్రమే వచ్చాయని.. 6వేల ఉద్యోగాల్లో మహిళలకు ఇచ్చింది కేవలం 70 మాత్రమే అని అన్నారు.

PM Modi: 41ఏళ్ల తర్వాత ఆదిలాబాద్‌కు ప్రధాని.. సీఎం రేవంత్ స్వాగతం

PM Modi: 41ఏళ్ల తర్వాత ఆదిలాబాద్‌కు ప్రధాని.. సీఎం రేవంత్ స్వాగతం

Telangana: జిల్లాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. సోమవారం ఉదయం జిల్లాకు చేరుకున్న ప్రధానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన సభలో మోదీ పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రామగుండం ఎన్‌టీపీసీ పవర్ ప్లాంట్ ప్రధాన మంత్రి జాతికి అంకితం చేశారు.

KCR BRS: ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఆ రెండు స్థానాలపై అదే సస్పెన్స్!

KCR BRS: ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఆ రెండు స్థానాలపై అదే సస్పెన్స్!

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీ అభ్యర్థులపై ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న పలువురి పేర్లను ఖరారు చేసినట్టుగా సమాచారం. కరీంనగర్‌ నుంచి బోయినపల్లి సంతోష్ కుమార్, పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ పార్టీ నేతలతో నేడు (ఆదివారం) జరిగిన సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.

BRS: మేడిగడ్డకు బయలుదేరిన బీఆర్ఎస్ బృందం

BRS: మేడిగడ్డకు బయలుదేరిన బీఆర్ఎస్ బృందం

Telangana: చలో మేడిగడ్డ పర్యటనలో భాగంగా బీఆర్‌ఎస్ బృందం మేడిగడ్డకు బయలుదేరింది. శుక్రవారం ఉదయం తెలంగాణ భవన్‌ను బస్సుల్లో కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మేల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు గులాబీ పార్టీ నేతలు బయలుదేరారు. హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి బస్సుయాత్ర చేపట్టారు. మొత్తం 200 మంది బిఆర్ఎస్ నేతల బృందం కాళేశ్వరంకు బయలుదేరి వెళ్లింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి