Home » Telangana Politics
బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్ల(Electricity Purchage) అక్రమాలపై ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి((Justice Narasimha Reddy)) కమిషన్ ముందే ఓ నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఈ విషయం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి.. కేసీఆర్(KCR)పై చేసిన వ్యాఖ్యల ద్వారా తెలుస్తోందన్నారు.
నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట బీఆర్ఎస్ మునిసిపల్ చైర్మన్ ఎడ్ల నర్సింహగౌడ్పై కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం బుధవారం నెగ్గింది. మునిసిపాలిటీ కౌన్సిలర్లకు అవిశ్వాస తీర్మానంపై ఎన్నికల అధికారి ఆర్డీవో మాధవి గత నెల 27న నోటీసులు జారీ చేశారు.
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి కుమార్తె, యూత్ కాంగ్రెస్ నేత తూర్పు జయారెడ్డి.. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్రావును మాజీమంత్రి హరీశ్రావు అభినందించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఎంపీ రఘునందన్రావు, మాజీ మంత్రి హరీశ్రావు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకున్నారు. అయితే బుధవారం వారిద్దరు ఎదురుపడినప్పుడు భిన్న వాతావరణం కనిపించింది.
ఛత్తీ్సగఢ్తో విద్యుత్ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్కేంద్రాల నిర్మాణంపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్కు బుధవారం ఇంధనశాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్మిశ్రా లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు.
విద్యుత్ కొనుగోళ్లు , కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణ(Kaleswaram project)పై మాజీమంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) స్పందించారు. విచారణ కమిషన్లు వాటి పని అవి చేసుకుంటాయని, రాష్ట్ర ప్రభుత్వం మీడియాకు ఎందుకు లీకులు ఇస్తోందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరంలో నీళ్లు నిలిపి సాగు నీరు అందించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి (MLA Vivek Venkataswamy) ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్, జగన్కు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు.
రానున్న రోజుల్లో తెలంగాణ(telangana)లో బీజేపీ(BJP) అధికారంలోకి వచ్చే విధంగా సమిష్టిగా పనిచేస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి(Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS) పార్టీ అయిపోయిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాదు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ఆరు నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు(KCR)ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకలకు తాను హాజరుకాబోవడం లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. అందుకుగల కారణాలను పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డికి శనివారం బహిరంగ లేఖ రాశారు.
ఓట్ల లెక్కింపు సమీపిస్తుండడంతో అన్ని పార్టీల్లో ఉత్కంఠ మొదలైంది. ఈనెల 13న లోక్సభ ఎన్నికలు జరగగా, జూన్ 4 కౌంటింగ్ జరగనుంది. లెక్కింపు సమయం సమీపిస్తుండడంతో అభ్యర్థులు కూడికలు, తీసివేతల పనిలో నిమగ్నమయ్యారు. గెలుస్తామా ? లేదా ? అని ద్వితీయ శ్రేణి నేతల వద్ద ఆరా తీస్తున్నారు. గ్రేటర్లో ఉత్కంఠగా సాగిన పోరులో గెలుపెవరిదన్న చర్చ జోరుగా సాగుతోంది. ఏ నలుగురు కలిసినా ఫలితాలపైనే మాట్లాడుకుంటున్నారు.