Home » Telangana News
తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ(Telangana State Formation Day) శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(BRS Working President KTR). బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు దశాబ్ది ఉత్సవాలను పండగ వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఓట్ల లెక్కింపు సమీపిస్తుండడంతో అన్ని పార్టీల్లో ఉత్కంఠ మొదలైంది. ఈనెల 13న లోక్సభ ఎన్నికలు జరగగా, జూన్ 4 కౌంటింగ్ జరగనుంది. లెక్కింపు సమయం సమీపిస్తుండడంతో అభ్యర్థులు కూడికలు, తీసివేతల పనిలో నిమగ్నమయ్యారు. గెలుస్తామా ? లేదా ? అని ద్వితీయ శ్రేణి నేతల వద్ద ఆరా తీస్తున్నారు. గ్రేటర్లో ఉత్కంఠగా సాగిన పోరులో గెలుపెవరిదన్న చర్చ జోరుగా సాగుతోంది. ఏ నలుగురు కలిసినా ఫలితాలపైనే మాట్లాడుకుంటున్నారు.
రైళ్లో మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన హోంగార్డును కాచిగూడ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి నుంచి హైదరాబాద్కు వెళ్తున్న వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో బాలిక నిద్రిస్తోంది. బాలిక వద్దకు వెళ్లిన హోంగార్డు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రతిఘటించిన యువతి వెంటనే ఫోన్ ద్వారా తండ్రికి సమాచారం ఇచ్చింది.
ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) వ్యవహారంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్(BJP MP Laxman) సంచలన కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో అనేక సంచలనాత్మక విషయాలు బయట పడుతున్నాయని.. ఈ వ్యవహారంపై రేవంత్ సర్కార్(CM Revanth Reddy) ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో జెట్ స్పీడ్తో నిర్మాణ రంగ అభివృద్ధి(Construction Sector Development) జరగాలని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి(Vem Narender Reddy) అన్నారు. జూబ్లీహిల్స్లోని(Jubilee Hills) జూబ్లీహిల్స్ క్లబ్లో(Jubilee Hills Club) మంగళవారం రాత్రి సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ ఆవిర్భావ వేడుకలు జరిగాయి.
హైదరాబాద్(Hyderabad) వాసులకు బిగ్ అలర్ట్. నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు(Power Supply) అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ అధికారులు(Electricity Department Officials) తెలిపారు. దాదాపు గంటన్నర పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని తెలిపారు. ఇంతకీ ఏ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది? కారణమేంటి? అనే వివరాలు తెలుసుకుందాం..
హైదరాబాద్, మే 27: ఇన్ని రోజులు ఏపీలో(Andhra Pradesh) మాత్రమే కొత్త కొత్త పేర్లతో బీర్లను చూశారు.. ఇప్పుడు తెలంగాణలోనూ(Telangana) కొత్త బీర్లు కిక్కు ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. అతి త్వరలోనే కొత్త కొత్త పేర్లతో బీర్లు మార్కెట్లోకి రానున్నాయి. తాజాగా తెలంగాణ సర్కార్ ..
హైదరాబాదులో మరో అంతర్జాతీయ కిడ్నీ రాకెట్(International kidney rocket) వెలుగు చూసింది. కేరళకు చెందిన యువకుడి మృతితో ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కీలక సూత్రధారి హైదరాబాద్కు చెందిన వైద్యుడిగా గుర్తించారు. కొంతకాలంగా పేదలకు డబ్బు ఆశ చూపి విదేశాలకు తీసుకువెళ్లి కిడ్నీ మార్పిడి చేస్తూ దందా సాగిస్తున్నారు. కిడ్నీ మార్పిడి చేయించుకున్న యువకుడు మృతిచెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
నగరం శివారులోని శేరిలింగంపల్లిలో అద్భుతం చోటు చేసుకుంది. భక్తులు ప్రసాదంగా సమర్పించిన పాలను అమ్మవారు తాగుతున్నారు. అదరుదైన, అద్భుతమైన ఘట్టాన్ని చూసి భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. అమ్మావారి నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోతుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోచమ్మతల్లి దేవత భక్తులు ..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై(BRS Working President KTR) మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy)ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ కేటీఆర్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి తమ ముఖ్యమంత్రి రేవంత్ని(Telangana CM Revanth Reddy) తిడితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.