Home » Telangana High Court
గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు సోమవారం వరకు ప్రకటించొదంటూ హైకోర్టు ఆదేశించింది. గ్రూప్ -1 పరీక్షకు సంబంధించి ఎన్ఎస్యూఐతో పాటు పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్కు తెలంగాణ హైకోర్టులో చుక్కుదురైంది.
కొత్తగూడెం ఎమ్మెల్యే అఫిడవిట్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. దీంతో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును కోర్టు ఎమ్మెల్యేగా ప్రకటించింది.
బీజేపీ మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు(మంగళవారం) ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో ధర్నా చేసుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యంపై మహాధర్నా చేయాలని బీజేపీ నిర్ణయించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సుదీర్ఘంగా విచారణ కొనసాగిన విషయం తెలిసిందే. దీంతో వాంగ్మూలాల్లోని కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పుడు తాజాగా సీబీఐ కోర్టుకు వెల్లడించిన రహస్య సాక్షి వివరాలు బయటకు వచ్చాయి. ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ సందర్భంగా సీబీఐ అధికారులు రహస్య సాక్షి ప్రస్తావనను హైకోర్టు ముందుకు తీసుకొచ్చారు.
హైదరాబాద్: బీఆర్ఎస్కు కోకాపేటలో 11 ఎకరాల భూమి కేటాయింపుపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి ఆదేశించింది.
భూ కేటాయింపు వివాదంలో ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్కు భారీ ఉపశమనం లభించింది. భూ వివాదంలో జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. దర్శకుడు ఎన్.శంకర్కు భూమి కేటాయింపును న్యాయస్థానం సమర్థించింది. దర్శకుడికి భూ కేటాయింపుపై దాఖలైన పిల్ను ధర్మాసనం కొట్టివేసింది.
దర్శకుడు ఎన్.శంకర్కు మోకిళ్లలో ఐదు ఎకరాల భూమిని కేటాయించడంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. దర్శకుడు ఎన్.శంకర్కు శంకర్పల్లిలోని మోకిల్లాలో ఎకరాకు ఐదు లక్షల చెప్పున ఐదు ఎకరాలు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయిం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై అభ్యంతరం తెలుపుతూ కరీంనగర్కు చెందిన జె.శంకర్ అనే వ్యక్తి వేసిన పిటిషన్పై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది.
75 ఏళ్ల పాటు ఆదివాసీలు నిర్వహించిన పోరాటానికి నేడు ఫలితం దక్కింది. పట్టువదలని విక్రమార్కుల్లా ఆదివాసీలు సుదీర్ఘ పోరాటం నిర్వహించి చివరకు సక్సెస్ అయ్యారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ పరిధిలోకి వస్తాయని తెలంగాణ హైకోర్టు నేడు తీర్పును వెలువరించింది.
కోర్టు నుంచి స్పష్టత వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. టీచర్లకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించినా కోర్టు కేసులు అడ్డు వస్తుండడంతో అధికారులు ఈ నిర్ణయానికి వచ్చారు. పదోన్నతులు, బదిలీల కోసం ఉపాధ్యాయ సంఘాల నుంచి ఒత్తిడి వస్తున్నా.. ఈ విషయంలో ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది.