Home » Telangana High Court
Telangana: కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసుకు సంబంధించి టీపీసీసీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. అమిత్ షా వీడియో మార్కింగ్ కేసులో ఢిల్లీ పోలీసుల వేధింపులపై కోర్టు దృష్టికి టీపీసీసీ తీసుకెళ్లింది. ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందిన 29 మంది సెక్రటరీల నివాసాలకు ఢిల్లీ పోలీసులు వెళ్లారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పెద్ద సంఖ్యలో నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవడంతో డీలా పడ్డ బీఆర్ఎస్ను మరింత నిరుత్సాహ పరిణామం ఎదురైంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి (MP Avinash Reddy) తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మాజీ మంత్రి వైఎస్ వివేక(YS Vivekananda Reddy) హత్య కేసులో అవినాశ్ బెయిల్ని(Bail) రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్ని కోర్టు కొట్టేసింది.
Telangana: దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసు అధికారులకు ఊరట లభించింది. సిర్పూర్ కమిషన్ నివేదిక ఆధారంగా సదరు అధికారులపై చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై ఏడుగురు పోలీసు అధికారులు, షాద్నగర్ తహసిల్దార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు(బుధవారం) ఈ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగగా..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా గెలిచి.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని వారిని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వారిపై అనర్హత పిటిషన్ను ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పీకర్ కార్యాలయానికి అందజేశారు.
Telangana: జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్కు హైకోర్టులో ఊరట లభించింది. రాహిల్ను రెండు వారాల వాటు అరెస్టు చేయకుండా ధర్మాసనం స్టే విధించింది. గతంలో రాహిల్కు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సవాల్ చేస్తూ జూబ్లీహిల్స్ పోలీసులు అపీల్కు వెళ్లారు. ఈరోజు (మంగళవారం) పోలీసుల పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది.
మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్ల విచారణను తిరిగి తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు పంపింది. కేవలం టెక్నికల్ రీజన్స్తోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం స్పష్టం చేసింది. కేసు మెరిట్స్లోకి తాము వెళ్లలేదని తెలిపింది.
Avinash Reddy Bail Petition: ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) గురువారం విచారణ జరిగింది. ఈ పిటిషన్పై సీబీఐ(CBI) తరఫు న్యాయవాది, పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ వాదనలు వినిపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా తనకు ప్రాణాహనీ ఉందని అప్రూవర్ దస్తగిరి(Dasthagiri) తరుపు కోర్టు దృష్టి తీసుకెళ్లారు.
Telangana: భూనిర్వాసితులకు పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా... కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోని వరంగల్ ఆర్డీవో అధికారులకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. వరంగల్ ఆర్డీవో కార్యాలయం జప్తునకు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం సంచలనం రేపుతోంది. ఓ భూమి విషయంలో రైతులు పరిహారం ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహిరంచడంతో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.
Telangana: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం ఎన్నికను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేత విజయారెడ్డి హైకోర్టులో దాఖులు చేసిన పిటిషన్పై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ విజయ్సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది సుంకర నరేష్ వాదనలు వినిపించారు. ఎన్నికల్లో దానం నాగేందర్ ఓటర్లను ప్రలోభపెట్టారని న్యాయవాది కోర్టుకు చెప్పారు.