Home » Telangana Govt
సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. చాలా వరకు వచ్చిన జీతంలో కొంత సేవింగ్ చేసి.. ఇల్లు కొంటారు. ఇంకొందరు ప్రభుత్వ సహకారంతో పాటుగా తమ కష్టాన్ని కలుపుకొని ఇంటిని నిర్మించుకుంటారు. అయితే.. అక్కడక్కడ పేదల పరిస్థితి దయనీయంగానే ఉంది.
పారిస్ పారాలింపిక్స్-20024లో సత్తాచాటిన యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఆమెకు రూ.కోటి నగదు, గ్రూప్-2 ఉద్యోగంతోపాటు వరంగల్లో 500గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Telangana: ములుగు జిల్లా మేడారం అడవుల్లో ఘోర విపత్తుపై ప్రభుత్వానికి అటవీ రక్షణ ప్రధానాధికారి డోబ్రియాల్ని వేదిక ఇచ్చారు. క్లౌడ్ బరస్ట్ వల్లే ఈ విపత్తు సంభవించిందని... మేఘాలు కిందకు వచ్చి బరస్ట్ కావడంతోనే చెట్లు నేలకూలాయని తెలిపారు. 3 కిలోమీటర్ల పొడవు, 2 కిలో మీటర్ల వెడల్పులో 204 హైక్టార్లలో 50వేల చెట్లు కూలాయన్నారు.
Telangana: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. తెలంగాణలో వరద నష్టం వివరాలు నిర్ణీత ఫార్మాట్లో తక్షణమే పంపాలని కేంద్ర హోమ్ శాఖ సూచించింది. 1345 కోట్ల రూపాయల ఎస్డీఆర్ఎఫ్ నిధులు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఉదారత చాటుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఇది చూసి చలించిపోయిన ఉద్యోగులు పెద్ద మనసు చాటుకున్నారు..
తెలంగాణ ప్రభుత్వం రైతులకు చేసిన రుణ మాఫీపై ఇంకా రాద్ధాంతం నడుస్తూనే ఉంది. 40 శాతం మందికి రుణమాఫీ జరగలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా.. ఆధార్, బ్యాంక్ అకౌంట్లు లాంటి సమస్యలతో నిలిచిపోయిన విషయం వాస్తవమేనని రేవంత్ సర్కార్ చెబుతున్న పరిస్థితి. ఈ క్రమంలో ఎల్లుండి (ఆగస్టు-22న) రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ధర్నాలకు పిలుపునిచ్చింది...
గురుకులాల్లో భర్తీ కాకుండా మిగిలిపోతున్న పోస్టులను తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. గురుకుల బోర్డు తాజాగా చేపట్టిన 9,024 పోస్టుల భర్తీకి ఇదే విధానం అమలు చేయాలని కేటీఆర్ అన్నారు.
మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. విద్యార్థులు గణాధిత్య, అనిరుధ్ మృతికి గల కారణాలను తోటి విద్యార్థులను అడిగి వారు తెలుసుకున్నారు. అలాగే అస్వస్థతకు గురైన నలుగురు చిన్నారుల పరిస్థితిపై పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ఠ ఉత్పత్తికి చీఫ్ ఇంజినీర్లు చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాలతోపాటు పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నందున వీలైనంత ఎక్కువ ఉత్పత్తిపై థర్మల్, హైడల్ ప్రాజెక్టుల సీఈలు దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 2 లక్షల రైతుల రుణ మాఫీ చేస్తాం అని హామీ ఇచ్చామని.. చేసి చూపిస్తున్నామని తెలిపారు.