• Home » Telangana Govt

Telangana Govt

CM Revanth Reddy: కేంద్రమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఆ అంశాలపై చర్చ..

CM Revanth Reddy: కేంద్రమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఆ అంశాలపై చర్చ..

రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కేంద్ర జ‌ల్‌ శ‌క్తి మంత్రి సి.ఆర్.పాటిల్‌(Central Minister CR Patil)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ నది డెవలప్మెంట్, రాష్ట్రంలోని ఇళ్లకు నల్లా కనెక్షన్ల కోసం పెద్దఎత్తున నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు.

KTR: నూతన చట్టాలపై మీ వైఖరి చెప్పాల్సిందే.. సర్కార్‌కు కేటీఆర్ లేఖ

KTR: నూతన చట్టాలపై మీ వైఖరి చెప్పాల్సిందే.. సర్కార్‌కు కేటీఆర్ లేఖ

Telangana: దేశంలో అమలులోకి వచ్చిన నూతన న్యాయ చట్టాల పైన రాష్ర్ట ప్రభుత్వం తన వైఖరి వెల్లడించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. వివిధ వర్గాల నుంచి కొత్త న్యాయ చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

Balalatha: స్మిత సబర్వాల్ వ్యాఖ్యలపై బాలలత స్ట్రాంగ్ కౌంటర్

Balalatha: స్మిత సబర్వాల్ వ్యాఖ్యలపై బాలలత స్ట్రాంగ్ కౌంటర్

Telangana: సివిల్స్‌లో దివ్యాంగుల కోటా అవసరమా అంటూ సీనియర్ ఐఏఎస్ అధికారణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. స్మిత వ్యాఖ్యలను పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. తాజాగా... ప్రముఖ మోటివేటర్, సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడమీ నిర్వాహకురాలు బాలలత స్పందిస్తూ స్మితపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telangana: నా అప్లికేషన్లు చెత్తబుత్తలో వేశారా.. మాజీ డీఎస్పీ నళిని ఆవేదన

Telangana: నా అప్లికేషన్లు చెత్తబుత్తలో వేశారా.. మాజీ డీఎస్పీ నళిని ఆవేదన

ప్రభుత్వానికి తాను అందించిన వినతిపత్రాలపై సానుకూల స్పందన రాకపోవడంతో సామాజిక మాద్యమం ఫేస్‌బుక్‌లో ఆమె ఒక పోస్టు పెట్టారు. తనను పీఆర్‌ స్టంట్ కోసం వాడుకొని వదిలేశారని మాజీ పోలీస్ అధికారి నళిని ఆవేదన వ్యక్తం చేశారు.

TG News: తెలంగాణలో మరో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ..

TG News: తెలంగాణలో మరో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ..

తెలంగాణలో మరో ఆరుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ వికాస్ రాజ్‌ను ట్రాన్స్‌పోర్టు, హౌసింగ్, జీఏడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

Group 2 Exams: అభ్యర్థులకు అలర్ట్.. గ్రూప్-2 పరీక్షలు వాయిదా..

Group 2 Exams: అభ్యర్థులకు అలర్ట్.. గ్రూప్-2 పరీక్షలు వాయిదా..

గ్రూప్-2 పరీక్షలను తెలంగాణ సర్కార్ వాయిదా వేసింది. ఆగస్టులో నిర్వహించాల్సిన పరీక్షలను డిసెంబర్‌కు వాయిదా వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7, 8తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాలని మెుదట నిర్ణయించగా నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో పరీక్షల తేదీలను మార్చింది.

Dana Kishore: శుభవార్త.. హైదరాబాద్ వాసులకు తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు..

Dana Kishore: శుభవార్త.. హైదరాబాద్ వాసులకు తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు..

నగరంలో భారీ వర్షాలకు వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు(Traffic Problems) తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ(MAUD Principal Secretary) దాన కిషోర్(Dana Kishore).. ఖైరతాబాద్ జంక్షన్, రాజ్ భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌజ్, సోమాజిగూడ ఆర్టీఏ ఆఫీసు ప్రాంతాలను పరిశీలించారు.

Bonalu Festival 2024: బోనాల సందడి షురూ.. తొలి బోనం ఎప్పుడంటే?

Bonalu Festival 2024: బోనాల సందడి షురూ.. తొలి బోనం ఎప్పుడంటే?

Telangana: ఆషాడ మాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరంలో బోనాల సందడి మొదలవుతుంది. అమ్మ బైలెల్లినాదే అంటూ అమ్మవారికి భక్తులు చీర, సారెలు, నైవేద్యాలు సమర్పిస్తుంటారు. ప్రతీ ఏడాది లాగే ఈ సారి కూడా హైదరాబాద్‌లో బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. గోల్కోండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల జాతర షురూ అవుతుంది.

CM Revanth: రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా కేశవరావుకు క్యాబినెట్ ర్యాంక్..!

CM Revanth: రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా కేశవరావుకు క్యాబినెట్ ర్యాంక్..!

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేశవరావు(Keshava Rao)కి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా క్యాబినెట్ ర్యాంక్(Cabinet rank) ఇవ్వాలని అనుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. కేశవరావు రాజీనామా విషయంలో కాంగ్రెస్ పార్టీ అంతా కలిసి నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు.

Srinivas Goud: మా మండలాలను మాకు ఇవ్వాలి: మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud: మా మండలాలను మాకు ఇవ్వాలి: మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్

ఈనెల 6న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేయడం సంతోషకరమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) అన్నారు. ఎన్డీయే కూటమిలో చంద్రబాబు (CM Chandrababu) కీలకమైన వ్యక్తిగా మారారు. రెండు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఇద్దరు సీఎంలు ఒత్తిడి తేవాలని మాజీ మంత్రి కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి