Home » Telangana Govt
Telangana: సివిల్స్లో దివ్యాంగుల కోటా అవసరమా అంటూ సీనియర్ ఐఏఎస్ అధికారణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. స్మిత వ్యాఖ్యలను పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. తాజాగా... ప్రముఖ మోటివేటర్, సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ నిర్వాహకురాలు బాలలత స్పందిస్తూ స్మితపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి తాను అందించిన వినతిపత్రాలపై సానుకూల స్పందన రాకపోవడంతో సామాజిక మాద్యమం ఫేస్బుక్లో ఆమె ఒక పోస్టు పెట్టారు. తనను పీఆర్ స్టంట్ కోసం వాడుకొని వదిలేశారని మాజీ పోలీస్ అధికారి నళిని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో మరో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ వికాస్ రాజ్ను ట్రాన్స్పోర్టు, హౌసింగ్, జీఏడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
గ్రూప్-2 పరీక్షలను తెలంగాణ సర్కార్ వాయిదా వేసింది. ఆగస్టులో నిర్వహించాల్సిన పరీక్షలను డిసెంబర్కు వాయిదా వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7, 8తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాలని మెుదట నిర్ణయించగా నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో పరీక్షల తేదీలను మార్చింది.
నగరంలో భారీ వర్షాలకు వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు(Traffic Problems) తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ(MAUD Principal Secretary) దాన కిషోర్(Dana Kishore).. ఖైరతాబాద్ జంక్షన్, రాజ్ భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌజ్, సోమాజిగూడ ఆర్టీఏ ఆఫీసు ప్రాంతాలను పరిశీలించారు.
Telangana: ఆషాడ మాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరంలో బోనాల సందడి మొదలవుతుంది. అమ్మ బైలెల్లినాదే అంటూ అమ్మవారికి భక్తులు చీర, సారెలు, నైవేద్యాలు సమర్పిస్తుంటారు. ప్రతీ ఏడాది లాగే ఈ సారి కూడా హైదరాబాద్లో బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. గోల్కోండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల జాతర షురూ అవుతుంది.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేశవరావు(Keshava Rao)కి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా క్యాబినెట్ ర్యాంక్(Cabinet rank) ఇవ్వాలని అనుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. కేశవరావు రాజీనామా విషయంలో కాంగ్రెస్ పార్టీ అంతా కలిసి నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు.
ఈనెల 6న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం ప్రగతి భవన్లో ఏర్పాటు చేయడం సంతోషకరమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) అన్నారు. ఎన్డీయే కూటమిలో చంద్రబాబు (CM Chandrababu) కీలకమైన వ్యక్తిగా మారారు. రెండు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఇద్దరు సీఎంలు ఒత్తిడి తేవాలని మాజీ మంత్రి కోరారు.
సీజనల్ వ్యాధులు, పాముకాటు నివారణ మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Raja Narasimha) అధికారులను ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో "తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్" (TGMSIDC) అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీపి కబురు చెప్పారు. టీఎస్ఆర్టీసీ(TSRTC)లో 3,035ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) వెల్లడించారు. 2014తర్వాత మొదటిసారి ఆర్టీసీలో రిక్రూట్మెంట్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.