Home » Telangana Formation Day
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi). రాష్ట్ర ఆవిర్భావం కోసం అమరులైన వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల ప్రత్యేక రాష్ట్ర కలను కాంగ్రెస్ పార్టీ(Congress Party) నెరవేరుస్తుందని 2004లోనే కరీంనగర్(Karimnagar)లో హామీ ఇచ్చానన్నారు.
Telangana Formation Day by BRS Party: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్లో ఈ నిర్వహించిన ఈ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. తెలంగాణ ఉద్యమ రోజులను స్మరించుకున్నారు.
తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ(Telangana State Formation Day) శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(BRS Working President KTR). బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు దశాబ్ది ఉత్సవాలను పండగ వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి పదేళ్లు అవుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరులకు నివాళులర్పించారు. ఆరు దశాబ్దాల కలను నెరవేర్చిన ఆ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.
మరికాసేపట్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల సంరంభం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ప్రారంభం కానుంది. వేడుకల్లో భాగంగా తెలంగాణ అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. పోలీస్ సిబ్బందికి అవార్డులను అందజేస్తారు. ఆవిర్భావ వేడుకలకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. అనారోగ్య కారణాల వల్ల ఆమె రావడం లేదని తెలుస్తోంది.
‘‘ఈ ఏడాది జూన్ 2కు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ రోజుతో తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణ విముక్తి లభించింది. విభజన చట్టం ప్రకారం ఇంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇకపై తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది.
‘‘సమ్మక్క, సారక్క, జంపన్నలను చంపినవారిగానే కాకతీయ రాజులను నేను చూస్తా. పన్నులు చెల్లించబోం అని అన్నందుకు ఆ గిరిజన యోధులపై దాడి చేసి హతమార్చారు. రుద్రమదేవి హయాం వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని రెడ్డి సామంతులు కాపాడారు. ప్రతాపరుద్రుడు వచ్చాక పద్మనాయకులను చేరదీశాడు. వారు చేయివ్వడంతో ఆ సామ్రాజ్యం పతనమైంది’’ అని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రాణత్యాగం చేసిన వారికి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్రావు శనివారం గన్పార్క్లో పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర సచివాలయ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
తెలంగాణలో 4వ విడత లోక్సభ ఎన్నికలు మే 13న జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓట్లను జూన్ 4వ తేదీన లెక్కించనున్నారు. కౌంటింగ్ కోసం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే ఈరోజు మెజారిటీ సర్వేలు ''ఎగ్జిట్ పోల్స్'' (Exit polls) ఫలితాలు తెలిపాయి.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జూన్2వ తేదీన రాష్ట్ర ద్విశాబ్ధి ముంగిపు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం, సాయంత్రం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.