• Home » Telangana BJP

Telangana BJP

Ramchandra Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై రాంచందర్‌ రావు సంచలన వ్యాఖ్యలు

Ramchandra Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై రాంచందర్‌ రావు సంచలన వ్యాఖ్యలు

కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాంచందర్‌ రావు జోస్యం చెప్పారు.

KTR VS  Bandi Sanjay: బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు.. ఎందుకంటే

KTR VS Bandi Sanjay: బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు.. ఎందుకంటే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారమైనవని, అవి తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో చేసినవని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు.

CM Revanth VS Kishan Reddy: రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి చట్టం చదవాలి.. సీఎం రేవంత్‌ సూచనలు

CM Revanth VS Kishan Reddy: రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి చట్టం చదవాలి.. సీఎం రేవంత్‌ సూచనలు

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కిషన్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కిషన్‌రెడ్డి ముందుగా చట్టం చదవాలని సూచించారు. రాజకీయ ఓబీసీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ లేదని స్పష్టం చేశారు. బీసీఈకి ఇప్పటికే 4శాతం రిజర్వేషన్లు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు.

Congress VS BJP: బీసీ బిల్లుపై.. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం

Congress VS BJP: బీసీ బిల్లుపై.. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్యర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్‌లో ధర్నా సైతం చేపట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలపై బీజేపీ నేతలు వరసగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి.

MLC Kavitha: కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో దొంగ దీక్షలు చేయొద్దు.. కవిత విసుర్లు

MLC Kavitha: కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో దొంగ దీక్షలు చేయొద్దు.. కవిత విసుర్లు

జయ శంకర్ సార్ జయంతి సందర్భంగా జాగృతి ఫౌండేషన్ డే జరుపుకుంటున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. సామాజిక తెలంగాణ కోసం పాటుపడాలని జయశంకర్ సార్ అనేక సార్లు చెప్పారని గుర్తుచేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నివర్గాల వారికి సమన్యాయం జరగాలని జయశంకర్ సార్ చెప్పే వారని పేర్కొన్నారు.

Guvvala Bala Raju VS BRS: కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్

Guvvala Bala Raju VS BRS: కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్

బీజేపీ, కాంగ్రెస్ నేతలు తనకు టచ్‌లోకి వచ్చిన మాట వాస్తవమని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. తన నియోజకవర్గం ప్రజల అభిప్రాయం మేరకు ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. బీఎల్ సంతోష్‌ను తాను ఎప్పుడూ విమర్శించలేదని గువ్వాల బాలరాజు పేర్కొన్నారు.

KTR: జూబ్లీహిల్స్‌ను మనమే  దక్కించుకుందాం..

KTR: జూబ్లీహిల్స్‌ను మనమే దక్కించుకుందాం..

రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని.. సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న అవినీతి, కుంభకోణాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాపాడుతోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. రెండు జాతీయపార్టీల ఎజెండా బీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించడమేనని, అందుకే ప్రధాని మోదీ ఇప్పటివరకు కుంభకోణాలకు పాల్పడుతున్న కాంగ్రెస్‌ సీఎంపై ఒక్క కేసు కూడా పెట్టలేదని విమర్శించారు.

Kishan Reddy:  బీసీ రిజర్వేషన్‌లు తగ్గించేందుకు కాంగ్రెస్ కుట్ర.. కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Kishan Reddy: బీసీ రిజర్వేషన్‌లు తగ్గించేందుకు కాంగ్రెస్ కుట్ర.. కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

బీసీల మెడలు కోసేలా ముస్లింలకు రిజర్వేషన్‌లు ఇవ్వడం అన్యాయమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు న్యాయం చేసిన పార్టీ బీజేపీ మాత్రమేనని ఉద్ఘాటించారు. గత 70 ఏళ్లలో కుల గణన ఎందుకు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. కులగణన చేయని కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ పార్లమెంట్ ముందు ముక్కు నేలకు రాయాలని కిషన్‌రెడ్డి విమర్శించారు.

KCR on Banakacharla Project: బనకచర్ల ప్రాజెక్ట్ నిలిపేయాల్సిందే.. మళ్లీ క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేద్దాం

KCR on Banakacharla Project: బనకచర్ల ప్రాజెక్ట్ నిలిపేయాల్సిందే.. మళ్లీ క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేద్దాం

ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా రేవంత్ ప్రభుత్వంపై పోరాడాలని గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గులాబీ నేతలతో ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మంగళవారం కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ మేరకు కేసీఆర్ ప్రకటన విడుదల చేశారు.

Ramchandra Rao:  తెలంగాణలో యూరియా కొరత ఎందుకొచ్చింది.. రేవంత్ ప్రభుత్వంపై టీ బీజేపీ చీఫ్ ప్రశ్నల వర్షం

Ramchandra Rao: తెలంగాణలో యూరియా కొరత ఎందుకొచ్చింది.. రేవంత్ ప్రభుత్వంపై టీ బీజేపీ చీఫ్ ప్రశ్నల వర్షం

బీసీ రిజర్వేషన్ విషయంలో తాము చిత్తశుద్ధితో ఉన్నామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఉద్ఘాటించారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ బీసీలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆక్షేపించారు. బీసీలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని రామచంద్రరావు హెచ్చరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి