Home » Telangana BJP
ప్రధాని నరేంద్ర మోదీ మేనియాతో కేంద్రంలో మూడోసారి అధికారం తమదేనన్న ధీమాతో ఉన్న కమలదళం నల్లగొండ స్థానంపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది..
తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు ప్రస్తుతం గ్రహస్థితి అనుకూలిస్తున్నట్లు లేదు. ఓవైపు కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు సీనియర్ నేతలు పార్టీకి గుడ్బై చెప్పి కాంగ్రెస్, బీజేపీ(BJP)లో చేరుతున్నారు. ఇప్పటికే నాగర్కర్నూల్, జహీరాబాద్ ఎంపీలు రాములు, బీబీ పాటిల్తో పాటు మరికొంతమంది సీనియర్లు బీజేపీలో చేరగా.. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్లో చేరారు.
ప్రధాని నరేంద్రమోదీ మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎ్సపై విమర్శనాస్త్రాలు సంధించారు.
Amit Shah Hyderabad Visit: కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) తెలంగాణ పర్యటన అంతా అత్యంత గోప్యంగా నడిచింది. షా ఎప్పుడు ఎక్కడ పర్యటిస్తారనే దానిపై సొంత పార్టీ నేతలకే క్లారిటీ లేని పరిస్థితి. మంగళవారం నాడు తెలంగాణకు వచ్చిన షా.. ముందుగా ఇచ్చిన షెడ్యూల్ను ఫాలో అవ్వలేదు.. మార్పులు, చేర్పులు జరుగుతూనే వచ్చాయి..
Amit Shah Public Meeting: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీ జోరు పెంచింది. ఈ ఎన్నికల్లో 12 లోక్సభ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న కాషాయ పార్టీ.. ఇందుకోసం వ్యూహ రచన చేస్తోంది. ఎన్నికల ముందు కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తున్నారు...
Telangana Elections 2024: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ (BJP) అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మంగళవారం నాడు సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో జరుగుతున్న సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ.. తెలంగా బీజేపీ సైబర్ యోధులకు ధన్యవాదాలు తెలిపారు..
Telangana Elections 2024: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ముందు రాష్ట్రంపై (Telangana) బీజేపీ (BJP) అగ్రనేతలు దండయాత్ర చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు దక్కించుకున్న కాషాయ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ టార్గెట్ను మించి సీట్లు గెలవాలని వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) హైదరాబాద్కు విచ్చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై(KTR) బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేటీఆర్కు కండకావరమెక్కి తన గురించి మాట్లాడుతున్నాడంటూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. కరీంనగర్లో(Karimnagar) మీడియాతో మాట్లాడిన ఆయన..
BRS MLA Kale Yadaiah: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ (Congress) పార్టీ హౌస్ ఫుల్ అవుతోంది. బీఆర్ఎస్ (BRS) తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ముఖ్య నేతలు ‘కారు’ దిగి హస్తం గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. మరికొందరు ముహూర్తం ఫిక్స్ చేసుకుని రెడీగా ఉన్నారు..
Telangana Parliament Elections: హైదరాబాద్ (Hyderabad) పార్లమెంట్ ఎంఐఎం అడ్డా.. 2004 నుంచి ఈ నియోజకవర్గం మజ్లిస్దే..!. ఒక్క మాటలో చెప్పాలంటే అసదుద్దీన్ కంచుకోట. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో గెలిచి నిలిచారయన. అంతకుమునుపు 1984 నుంచి 2004 వరకు సుల్తాన్ సలాఉద్దీన్ ఓవైసీ ఆరు పర్యాయాలు ఎంపీగా విజయం సాధించారు. అయితే.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అసద్కు చెక్ పెట్టాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు దక్కడంతో కమలం పార్టీ ఫుల్ జోష్లో ఉంది. ఇదే జోష్లో పార్లమెంట్ స్థానాలను సైతం ఎక్కువగానే సాధించాలని వ్యూహ రచన చేస్తోంది...