Home » Telangana Assembly
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభ మొదలైన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ అధికార నాయకత్వంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గులాబీ పార్టీ అధ్యక్షుడు, అసెంబ్లీలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నాయకులను డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్, ఉప నేతలు, విప్లుగా ప్రకటించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిసారి బీఆర్ఎస్ నాయకులను విమర్శించడమే సరిపోతోందని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు. నీటి వాటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిద్ర పోతుందా.. నిద్ర పోతున్నట్లు నటిస్తుందా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
కృష్ణా జలాల్లో తాము 90టీఎంసీలు డిమాండ్ చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తాము 45 టీఎంసీలు మాత్రమే అడిగామని హరీశ్రావు దుష్ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. అబద్ధాల పునాదులపై బీఆర్ఎస్ బతుకుతోందని ఎద్దేవా చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన వెంటనే కేవలం ఐదు నిమిషాల్లోనే తిరిగి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం ఇచ్చారు సీఎం.
తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. అందరికంటే ముందే తన చైర్లో కూర్చున్న మాజీ సీఎం.. కాసేపటికే అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు.
తెలంగాణ అసెంబ్లీ శీతాకాలం సమావేశాలు ప్రారంభమయ్యాయి. సుమారు తొమ్మిది నెలల విరామం తర్వాత సభకు హాజరయ్యారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. అయితే.. అసెంబ్లీలో ఒక ఆసక్తికర పరిణాం చోటు చేసుకుంది.
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో వెయ్యి మంది పోలీసు సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక యావరేజ్గా 20రోజుల పాటు మాత్రమే సభను నడిపారని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈ ఏడాది 16రోజులు మాత్రమే సభను నడిపారని ప్రస్తావించారు.
సోమవారం నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష కేసీఆర్ హాజరవనున్నారా? సభలో కృష్ణా జలాలపై జరిగే చర్చలో ఆయన పాల్గొంటారా? అంటే అవుననే చెబుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు.