Home » Teacher
ఉపాధ్యాయుడు అంటే దేవుడితో సమానంగా చూస్తుంటాం. అలాగే వారు కూడా ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుంటూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉన్నత శిఖరాలకు చేరేలా ప్రోత్సహిస్తారు. అయితే ఇదంతా ఒకప్పటిమాట. ప్రస్తుతం ...
అమరావతి: గత ప్రభుత్వం వివాదాస్పద రీతిలో ప్రవేశపెట్టిన బాత్రూమ్ల ఫొటోల యాప్కు చంద్రబాబు ప్రభుత్వం ఫుల్స్టాప్ పెట్టింది. బాత్రూమ్ ఫొటోలు తీసి అప్లోడ్ చేసే యాప్ను పాఠశాల విద్యాశాఖ తొలగించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం పాఠశాలల్లో అనేక రకాల యాప్లు తీసుకొచ్చింది.
ప్రైవేటు స్కూళ్లలో పదోతరగతి ఫెయిల్ అయినవారే ఉపాధ్యాయులుగా ఉన్నారంటూ.. వారిని అవమానించేలా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడటం తగదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు.
సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు రావడంతో ఉపాధ్యాయులు(Teachers) ఆనందోత్సవాల్లో మునిగి తేలుతున్నారు. థాంక్యూ సీఎం సార్.. అంటూ రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఎల్బీ స్టేడియం(LB Stadium)లో శుక్రవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎంతో ముఖాముఖి, ఆత్మీయ సమ్మేళనానికి ఇటీవల పదోన్నతి పొందిన టీచర్లందరూ హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అన్నారు. తాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఈ స్థాయికి వచ్చానని, ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేస్తే ఏదైనా సాధ్యమేనని చెప్పారు.
ప్రభుత్వ బడుల్లోనే చదువుకుని తాను ఈ స్థాయికి వచ్చానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని అన్నారు.
టీచర్ మద్యం తాగిన ఘటన మధ్యప్రదేశ్ షాబ్దుల్ జిల్లాలో జరిగింది. షార్గాఢ్ గ్రామంలో గల బహ్రియల్ తోలా ప్రాథమిక పాఠశాలలో ఉదయ్ భాను సింగ్ అనే టీచర్ పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే శనివారం కూడా పాఠశాలకు వచ్చాడు. కాసేపు అయ్యిందో లేదో ఊగుతూ కనిపించాడు.
ప్రతి మండలానికి మూడు చొప్పున.. సగటున పదేసి ఊళ్లకు ఒక రెసిడెన్షియల్ స్కూల్ను ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. 15 నుంచి 20 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
వైద్య కళాశాలల ప్రొఫెసర్ల బదిలీలను ఆపాలని సీనియర్ రెసిడెంట్ వైద్య విద్యార్థులు కోరుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల సూపర్ స్పెషాలిటీ ప్రొఫెసర్ల బదిలీల కారణంగా ఓ వైపు వైద్యసేవలపై, మరోవైపు బోధనపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు పేర్కొన్నారు.
జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో) ఎన్.వి.దుర్గాప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.