Home » TDP - Janasena
అవయవ దానంతో పలువురికి జీవదాతలుగా నిలిచిన వారి పార్థివ దేహాలకు గౌరవప్రదమైన వీడ్కోలు తెలిపాలని, వారి అంతియ యాత్రను రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో మళ్లీ జన్మభూమి కార్యక్రమం చేపట్టాలని టీడీపీ పొలిట్బ్యూరో నిర్ణయించింది. పేదరిక నిర్మూలనకు పీ4 విధానాలను అమలు చేయాలని నిశ్చయించిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు.
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. గత ఐదేళ్లూ ఉపాధి హామీ పథకాన్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేయడంతో కేంద్ర అధికారుల వద్ద మన అధికారులు తలవంచుకోవాల్సిన పరిస్థితి!
ప్రజలు అధికారం ఇచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు.. బాధ్యతతో వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికే అని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నోసార్లు చెప్పారు.
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలోని 5 వ బ్లాక్లో కలెక్టర్లతో సమావేశం అయ్యారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి భేటీ ఇదే కావడం గమనార్హం. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇవాళ జరుగుతున్న కాన్పరెన్స్ చరిత్రాత్మకమైన కాన్ఫరెన్స్ అని, చరిత్ర తిరగరాయబోతోందని అన్నారు.
ప్రభుత్వం మారింది! కానీ... పరిస్థితులను మాత్రం వైసీపీ అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గతంలో అడ్డగోలుగా తవ్వుకున్న లేటరైట్ ఖనిజాన్ని ఇప్పుడు దర్జాగా తరలించుకుపోతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రాలు ఇవ్వడానికి వేల సంఖ్యలో తరలివచ్చిన అర్జీదారులతో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం కిటకిటలాడింది. ప్రతి శనివారం ఆయన పార్టీ కార్యాలయానికి వస్తుండటంతో తమ సమస్యలు నేరుగా వివరించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి శనివారం భారీగా ప్రజానీకం తరలివచ్చారు.
రాష్ట్రంలో దెబ్బతిన్న వ్యవస్థలన్నింటినీ వంద రోజుల్లో గాడిలో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో గ్రీవెన్స్ సందర్భంగా ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకునేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ని వినతులు వచ్చినా...
ఏలూరు రైల్వేస్టేషన్లో వందేభారత్ రైలుకు హాల్టింగ్ ఇవ్వాలని రైల్వే ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(కోచింగ్) దేవేంద్రకుమార్కు ఎంపీ పుట్టా మహే్ష కుమార్ విజ్ఞప్తి చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఐదవరోజు శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ఈ సందర్భంగా పత్రికలకు ప్రకటనలపై శాసనసభ దద్ధరిల్లింది. టీడీపీ సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు.