Home » TDP - Janasena
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తిరుపతి జిల్లాలోని శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా రూ.1,570 కోట్ల పెట్టుబడులతో, 8,480 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఏర్పాటైన 15 పరిశ్రమలను ఆయన ప్రారంభించనున్నారు.
పోలవరం భూసేకరణ స్పెషల్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లకు నిప్పుపెట్టిన ఘటనపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీసుస్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు నిబంధనలు పాటించని నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్(ఏపీ) భవన్కు నూతన భవన నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
వైసీపీ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలు చేపట్టిన ఉపాధి పనుల పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు కూటమి సర్కారులోని కొంత మంది అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. హడావుడిగా బిల్లుల చెల్లింపునకు ఫైళ్లు సిద్ధం చేశారు.
వయనాడ్ బాధితులకు మేమున్నామంటూ ఏపీ సర్కార్(AP Govt) ముందుకు వచ్చింది. కేరళ వయనాడ్ బాధిత కుటుంబాల కోసం ఏకంగా రూ.10కోట్ల విరాళాన్ని అందజేసేందుకు సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) సర్కార్ నిర్ణయించింది.
గత వైసీపీ పాలనలో అన్నివిధాలా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ చెప్పారు. మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామన్నారు.
గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం తనకు ఉన్న అధికారాలతో ప్రతిపక్ష నాయకులపై, సామాన్యులపై ఎడాపెడా దొంగకేసులు పెట్టింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని సమీక్షిస్తుందనగానే, జగన్ రోతపత్రిక ఉలిక్కిపడుతోంది.
సకాలంలో కౌంటర్లు వేయకుండా జాప్యం చేస్తే ఇకపై ఖర్చులు విధిస్తామని అధికారులను హైకోర్టు హెచ్చరించింది. వివిధ వ్యాజ్యాలలో కౌంటర్ దాఖలు చేసేందుకు తగిన సమయం ఇస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది.
‘ఒక్కసారి చెబితే... వందసార్లు చెప్పినట్లే’ అన్నది సూపర్ స్టార్ రజినీకాంత్ ‘బాషా’లోని ఓ ఫేమస్ డైలాగ్. ‘వంద మంది ఆర్టీఐ దరఖాస్తులు పెట్టుకున్నా... ఒక్కదానికీ జవాబు చెప్పం’ అన్నది రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్ బాషా తీరు! వైసీపీ హయాంలో ‘సమాచార హక్కు చట్టం’ ఉండీ లేనట్లుగా తయారైంది.
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గురువారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది.