Home » Tamilnadu News
లోక్సభ ఎన్నికల్లో మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19వ తేదీ తొలి దశ పోలింగ్ జరగనుంది. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తుంది. ఈ దశలో మొత్తం 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ సర్వం సిద్దం చేస్తుంది.
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈసీ నిఘాను పటిష్టం చేస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి చెందిన హెలికాఫ్టర్ను ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు. తమిళనాడు నీలగిరి జిల్లాలో రాహుల్ పర్యటన కోసం వచ్చిన హెలికాఫ్టర్ను క్షుణ్ణంగా పరిశీలించారు.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. దేశంలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. అధికార బీజేపీని ఢీ కొట్టడమే ధ్యేయంగా తమిళనాడులో రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడానికి రెడీ అయ్యాయి. తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే, జాతీయ పార్టీ ఏఐఎంఐఎం(AIMIM)లు పొత్తుకు సిద్ధమయ్యాయి.
Andhrapradesh: తమిళనాడులో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సిద్ధమయ్యారు. అందులో భాగంగా కాసేపటి క్రితమే లోకేష్ కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్లారు. గురువారం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో యువనేత కోయంబత్తూరు పయనమయ్యారు. కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి, తమిళనాడు బీజేపి రాష్ర్ట అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా ప్రచారం లోకేష్ ప్రచారం చేయనున్నారు. ఈ క్రమంలోనే యువనేత అక్కడకు బయలుదేరి వెళ్లారు. తెలుగువారు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాల్లో లోకేష్ ప్రచారం చేయనున్నారు.
తమిళనాడులో ఓ కారు బుధవారం ఉదయం బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురై జిల్లాలోని విరుదునగర్ - మధురై నాలుగు లేన్ల జాతీయ రహదారిపై శివరకోట్టై వద్ద ఈ ప్రమాదం జరిగింది.
వ్యవసాయంలో కొందరు రైతులు నూతన ఒరవడిలు సృష్టిస్తున్నారు. నష్టాల్లో ఉన్న పంటలను లాభదాయకంగా మార్చే ప్రణాళికలు రచిస్తున్నారు. తమిళనాడుకి చెందిన ఓ రైతు కొంచం విస్తీర్ణంలో పాలకూర సాగు చేస్తూ వేలల్లో ఆదాయం సంపాదిస్తున్నాడు. విల్లుపురం పనంపట్టు ప్రాంతానికి చెందిన మురుగన్ అనే రైతు కొన్నిరోజులుగా పాలకూర పండిస్తున్నాడు.
Tamilisai Soundararajan: తెలంగాణ, పుదుచ్చేరిల మాజీ గవర్నర్(Ex Governor) తమిళి సౌందరరాజన్(Tamilisai Soundararajan) బీజేపీ(BJP)లో చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy), తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆధ్వర్యంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు.
తమిళనాడులోని (Tamilnadu) రెండు పాఠశాలలకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో.. పాఠశాలల సిబ్బందితో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. కోయంబత్తూర్లోని (Coimbatore) పీఎస్బీబీ మిలీనియం స్కూల్ (PSBB Millennium School), కాంచీపురం జిల్లాలోని (Kancheepuram District) ఓ ప్రైవేట్ పాఠశాలకు ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయి.
కుప్పం, తమిళనాడు సరిహద్దుల్లోని పాలార్ ప్రాజెక్ట్ వివాదం (Palar Project Controversy) మళ్లీ తెరమీదకి వచ్చింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) చేసిన ప్రకటన కారణంగా.. ఈ వివాదం మరోసారి అగ్గిరాజుకుంది. ఇటీవల కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో భాగంగా.. 0.6 టీఎంసీల కెపాసిటీతో రూ.215 కోట్ల వ్యయంతో చిన్నపాటి రిజర్వాయర్ను (Reservoir) పాలార్ ప్రాజెక్ట్పై నిర్మిస్తామని సీఎం జగన్ ప్రకటించారు.
తమిళనాడులో (Tamilnadu) ఓ దారుణ సంఘటన వెలుగు చూసింది. వేరే కులానికి చెందినవాడ్ని పెళ్లి చేసుకుందన్న కోపంతో.. అమ్మాయి తరఫు బంధువులు ఆమె భర్తను అతి కిరాతకంగా హతమార్చారు. ఈ కేసులో బాధితురాలి బావతో పాటు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మృతుడ్ని మెకానిక్గా పని చేస్తున్న ప్రవీణ్గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన చెన్నై (Chennai) నగరానికి సమీపంలోని పల్లికరణై ప్రాంతంలో శనివారం చోటు చేసుకుంది.