Home » Talasani Srinivas Yadav
సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్ పాకాల ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం పోలీసులు చేశారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. దీని వెనుక బలమైన కుట్రకోణం ఉందన్నారు. రాష్ట్రంలో సమస్యలపై సీఎం రేవంత్రెడ్డి దృష్టి పెట్టాలని అన్నారు. ఫామ్హౌస్కు సొంత ఇంటికి సంబంధం ఏంటని అడిగారు.
Telangana: రేవంత్ నిర్ణయాలతో ఆయన కుటుంబ సభ్యులు కూడా మాటలు పడాల్సి వస్తుందని తలసాని అన్నారు. ఇంతమందిని బాధపెట్టి రేవంత్ ఏం సాధిస్తారని ప్రశ్నించారు. మూసీ సుందరణ పేరుతో పేదలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఐదు నెలలుగా తీహాడ్ జైలులో ఉన్న కవిత.. సుప్రీం బెయిల్ మంజూరు చేయడంతో విడుదలకానున్నారు. కవితకు సుప్రీం బెయిల్ మంజూరు చేయడంపై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ...కవితకు బెయిల్ రావడం సంతోషంగా ఉందన్నారు.
ట్రాఫిక్ నిబంధనల పేరుతో చిరు (ఫుట్పాత్) వ్యాపారులను ఇబ్బందులకు గురిచేయొద్దని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Sanatnagar MLA Talasani Srinivas Yadav) అధికారులను ఆదేశించారు. మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని మోండా మార్కెట్, ఓల్డ్ గాంధీ హాస్పిటల్, ఓల్డ్ జైల్ఖానా తదితర ప్రాంతాలకు చెందిన పలువురు చిరువ్యాపారులు (హాకర్స్) మంగళవారం వెస్ట్మారేడుపల్లిలోని ఆయన నివాసం వద్ద కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు.
Telangana: భాగ్యనగరంలో బోనాల సందడి షురూ అయ్యింది. ఇప్పటికే గోల్కొండ అమ్మవారికి బోనమెత్తడంతో ఉత్సవాలు మొదలయ్యాయి. అలాగే ఈనెల 21న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్లో పర్యటించారు.
వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అధికారులను ఆదేశించారు.
తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్ కీలక సమావేశానికి నగరానికి చెందిన ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మరో 15 మంది కార్పొరేటర్లూ గైర్హాజరయ్యారు.
ఆరు.. ఇప్పుడు ఈ నంబర్ కారు పార్టీలో (BRS) కంగారెత్తిస్తోంది..! ఇంకా చెప్పాలంటే గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు (KCR) గుబులెత్తిస్తోంది..! ఎందుకంటే.. అంతలా బీఆర్ఎస్ను ఈ నంబర్ ఇబ్బంది పెడుతోంది.. అంతకుమించి వణికించేస్తోంది..!
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షులు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు తలసాని శంకర్ యాదవ్ మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో శంకర్ యాదవ్ బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
Telangana: ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) పై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది. ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా నేడు అన్ని నియోజకవర్గాల్లో నిరసనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.